Election Results: నేడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు.. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల్లో ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat and Himachal Pradesh election results today: దేశవ్యాప్తంగా ఉత్కంఠతకు నేడు తెరపడనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలతో పాటు అన్ని పార్టీలకు, దేశప్రజలకు ఆసక్తి నెలకొంది. ఢిల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాష్ట్రాలపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే వరస పరాజయాలతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే ఈ రెండు రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
Read Also: Rajasthan: రాజస్థాన్ మంత్రి బూతుపురాణం.. మహిళతో అసభ్యకరమైన వీడియో
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
2014 నుంచి వరసగా పరాజయాలు పాలవుతున్న కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ కంచుకోటలను బద్ధలు కొట్టాలనుకుంటోంది ఆప్. గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని.. ఆ పార్టీకి గత ఎన్నికలతో పోలిస్తే అధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 68 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య నెక్ టూ నెక్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నాయి పలు సర్వే సంస్థలు.
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో గెలుపు బీజేపీకి చాలా కీలకం. గత 27 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఈ రాష్ట్రంలో వరసగా ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. అయితే ఈ సారి బీజేపీ ఆ సంప్రదాయానికి తెరదించాలని చూస్తోంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!