Gujarat: విషపూరిత మద్యం తాగి 28 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ లో అక్రమ మద్యానికి ప్రజలు పిట్టల్లా రాతున్నారు. గుజరాత్ బోటాడ్ జిల్లాలో విషపూరితమైన మద్యం సేవించడం వల్ల చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఇదిలా ఉంటే అక్రమ మద్యం వల్ల ఇప్పటి వరకు గుజరాత్ రాష్ట్రంలోమ 28 మంది మరణించారు. బోటాడ్ జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది మరణించగా.. ఈ రోజు మృతుల సంఖ్య 28కి చేరినట్లు డీజీపీ ఆశిష్ భాటియా వెల్లడించారు. ఈ విషాదకర ఘటనపై బర్వాలా, రాన్పూర్ మరియు అహ్మదాబాద్ రూరల్లో మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
Read Also: Tamil Nadu: పరువు హత్య.. కూతురు, అల్లుడిని దారుణం హతమార్చిన తండ్రి
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
భావ్ నగర్, బోటాడ్, బర్వాలా, ధంధూకాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపుగా 30 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున బర్వాలా తాలూకాలోని రోజిద్ గ్రామంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగా తీవ్ర అస్వస్థతకు గురువ్వడంతో వారందరిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. ఈ కల్తీ మద్యాన్ని విక్రమిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు డిఫ్యూటీ సూపరింటెండెంట్ ర్యాంకు కలిగిన పోలీస్ అధికారి ఆధ్వర్యంలో ప్రతేక్య దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై విచారణ చేయడంతో పాటు నకిలీ మద్యాన్ని విక్రయించిన నిందితుల కోసం వేట కొనసాగుతోంది. గతంలో బీహార్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగాయి. ఈ కేసులో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ కూడా విచారణలో భాగం అవుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?