Tamil Nadu: పరువు హత్య.. కూతురు, అల్లుడిని దారుణం హతమార్చిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil nadu Honor killing, father killed daughter: తమిళనాడులో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. పరువు హత్యలకు సంబంధించి ఇటీవల కాలంలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరో పరువు హత్య తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురును, అల్లుడిని దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. ఈ ఘటనల తూత్తుకూడి జిల్లాలో జరిగింది.
తూత్తూకూడి జిల్లా వీరపట్టి సమీపంలోని జేవియర్ నగర్ కు చెందిన ఎం రేష్మ(20), వీ. మాణిక్క రాజు(28)లు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు ఒకే వీథిలో నివసిస్తుండటంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా కూడా పెద్దవాళ్లు తమ ప్రేమ పెళ్లికి ఒప్పుకోరని.. ఇటీవల మధురై సమీపంలోని తిరుమంగళంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని రేష్మ తండ్రి మత్తు(43) మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు రేష్మ దంపతులపై కక్ష పెంచుకున్నాడు.
Also Read
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
Read Also: Crime in Uttar Pradesh: ఒకరిపై వేధింపులు.. మరొకరిపై అనుమానం.. యూపీలో దారుణం..
లారీ డ్రైవర్ అయిన ముత్తుకుట్టి, కూతురు రేష్మకు పెళ్లి నిశ్చయించే పనిలో ఉన్నాడు. ఈ లోపే జూన్ 28న మానిక్క రాజుతో రేష్మ పారిపోయింది. ఈ ఘటనపై ఎట్టయ్యపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా నమోదు అయింది. ఇదిలా ఉండగా.. మధురైలో పెళ్లి చేసుకున్న తరువాత వారం రోజుల క్రితం రేష్మ, మాణిక్క రాజు సొంతూరు వీరవట్టికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం దంపతులు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ముత్తు కుట్టి రేష్మ గొంతు కోశాడు.. అల్లుడు మానిక్క రాజును నరికి చంపాడు. ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పెళ్లి తరువాత పోలీసులు ఇరు కుటుంబాలకు నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. రేష్మ మేజర్ కావడంతో పోలీసులు కూడా ఆమె ఇష్టానికి గౌరవం ఇవ్వాలని సూచించారు. అయితే దంపతులకు ప్రాణహాని ఉందని.. సొంతూరుకు రావద్దని సూచించామని.. అయితే ఇటీవల పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వచ్చారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని తూత్తుకూడి ఎస్పీ ఎల్ బాలాజీ శరవణన్ పరిశీలించారు. నిందితుడి ఆచూకీ కోసం స్నిఫర్ డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. మృతదేశాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
-
Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
-
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్పై బుచ్చిబాబు ఎమోషనల్!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!