Tamil Nadu: పరువు హత్య.. కూతురు, అల్లుడిని దారుణం హతమార్చిన తండ్రి
Tamil nadu Honor killing, father killed daughter: తమిళనాడులో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. పరువు హత్యలకు సంబంధించి ఇటీవల కాలంలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరో పరువు హత్య తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురును, అల్లుడిని దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. ఈ ఘటనల తూత్తుకూడి జిల్లాలో జరిగింది.
తూత్తూకూడి జిల్లా వీరపట్టి సమీపంలోని జేవియర్ నగర్ కు చెందిన ఎం రేష్మ(20), వీ. మాణిక్క రాజు(28)లు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు ఒకే వీథిలో నివసిస్తుండటంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా కూడా పెద్దవాళ్లు తమ ప్రేమ పెళ్లికి ఒప్పుకోరని.. ఇటీవల మధురై సమీపంలోని తిరుమంగళంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని రేష్మ తండ్రి మత్తు(43) మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు రేష్మ దంపతులపై కక్ష పెంచుకున్నాడు.
Also Read
- IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
- PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
- Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
- Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
Read Also: Crime in Uttar Pradesh: ఒకరిపై వేధింపులు.. మరొకరిపై అనుమానం.. యూపీలో దారుణం..
లారీ డ్రైవర్ అయిన ముత్తుకుట్టి, కూతురు రేష్మకు పెళ్లి నిశ్చయించే పనిలో ఉన్నాడు. ఈ లోపే జూన్ 28న మానిక్క రాజుతో రేష్మ పారిపోయింది. ఈ ఘటనపై ఎట్టయ్యపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా నమోదు అయింది. ఇదిలా ఉండగా.. మధురైలో పెళ్లి చేసుకున్న తరువాత వారం రోజుల క్రితం రేష్మ, మాణిక్క రాజు సొంతూరు వీరవట్టికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం దంపతులు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ముత్తు కుట్టి రేష్మ గొంతు కోశాడు.. అల్లుడు మానిక్క రాజును నరికి చంపాడు. ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పెళ్లి తరువాత పోలీసులు ఇరు కుటుంబాలకు నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. రేష్మ మేజర్ కావడంతో పోలీసులు కూడా ఆమె ఇష్టానికి గౌరవం ఇవ్వాలని సూచించారు. అయితే దంపతులకు ప్రాణహాని ఉందని.. సొంతూరుకు రావద్దని సూచించామని.. అయితే ఇటీవల పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వచ్చారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని తూత్తుకూడి ఎస్పీ ఎల్ బాలాజీ శరవణన్ పరిశీలించారు. నిందితుడి ఆచూకీ కోసం స్నిఫర్ డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. మృతదేశాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Redmi Note 17 Pro Max: 200MP కెమెరా + 10,000mAh బ్యాటరీ.. Redmi Note 17 Pro Max షాక్ ఇస్తున్న లీక్లు
-
Royal Enfieldకు పోటీగా Yezdi Scrambler 350.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే!
-
Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..
-
Donald Trump: ట్రంప్ వర్సెస్ నాటో.. మిత్రదేశాలకు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం!
-
IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!