India: ‘‘సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి’’.. ఇజ్రాయిల్లో ఉంటున్న భారతీయులకు కేంద్రం కీలక సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: ఇజ్రాయిల్-హమాస్ పోరు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇజ్రాయిల్లో ఉంటున్న భారతీయులకు మంగళవారం కీలక సూచనలను జారీ చేసింది. క్షిపణి దాడిలో భారతీయులు మరణించిన తర్వాత, ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘‘ ప్రస్తుతం భద్రతా పరిస్థితులు, స్థానిక భద్రతా సలహాల దృష్ట్యా దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే, సందర్శించే వారు ఇజ్రాయిల్ లోని సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చాలని సూచించారు. రాయబార కార్యాలయం వారితో టచ్లో ఉంది. ఇజ్రాయిల్ అధికారులు మా పౌరులందరికీ భద్రత కల్పించాలి’’ అని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ద్వారా పేర్కొంది.
పోస్టులో ఎంబసీ సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్ షేర్ చేసింది. ఎంబసీ తన పోస్ట్లో ఇజ్రాయెల్ జనాభా మరియు ఇమ్మిగ్రేషన్ అథారిటీ యొక్క హాట్లైన్ నంబర్ను కూడా షేర్ చేసింది. క్షిపణి దాడిలో భారతీయులు మరణించిన తర్వాత ఇండియా ఈ సూచనలను జారీ చేసింది. లెబనాన్ నుంచి ప్రయోగించిన యాంటీ ట్యాంక్ మిస్సైల్ ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దు ప్రాంతాన్ని తాకింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. ముగ్గురు కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక

Read Also: Haiti: ఎవరీ జిమ్మి చెరిజియర్.. గ్యాంగ్స్టర్కి వణుకుతున్న హైతీ దేశం..
చనిపోయిన వ్యక్తిని కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన 31 ఏళ్ల పాట్ నిబిన్ మాక్స్వెల్గా గుర్తించారు. మాక్స్వెల్ రెండు నెలల క్రితమే ఇజ్రాయెల్కు వచ్చి, అక్కడి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నట్లు సమాచారం. గాయపడిన ఇద్దరు భారతీయులను బుష్ జోసెఫ్ జార్జ్ మరియు పాల్ మెల్విన్లుగా గుర్తించారు.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై దాడి చేసి, 1200 మందిని చంపడంతో పాటు 240 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్, వెస్ట్ బ్యాంకులపై దాడులు నిర్వహిస్తోంది. మరోవైపు లెబనాన్ లోని హిజ్బుల్లా గ్రూప్ హమాస్కి మద్దతుగా ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంపై దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు గాజా యుద్ధంలో 30,000 మందికి పైగా మరణించినట్లు గాజాలోని ఆరోగ్య అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?