Haiti: ఎవరీ జిమ్మి చెరిజియర్.. గ్యాంగ్స్టర్కి వణుకుతున్న హైతీ దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haiti: కరేబియన్ ప్రాంతంలో అత్యంత పేదదేశంగా ఉన్న హైతీ ప్రస్తుతం ప్రమాదం అంచున ఉంది. ఆ దేశంలో ప్రస్తుతం గ్యాంగ్స్టర్ ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం పొంచిఉంది. జిమ్మి చెరిజియర్, ‘‘బార్బెక్యూ’’గా పిలువబడే క్రూరమైన గ్యాంగ్ లీడర్, ఇటీవల 3700 మంది ఖైదీలను విడిపించడంతో ఒక్కసారిగా ఆ దేశం ఉలిక్కిపడింది. ఆ దేశ అధినేత కెన్యా పర్యటనలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో హైతీ దేశానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
Read Also: Chiranjeevi: ముకేశ్ అంబానీ ఇప్పుడు చేశాడు.. కానీ, చిరు ఎప్పుడో చేశాడు.. అది మెగాస్టార్ అంటే..
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
మాజీ పోలీస్ అధికారి నుంచి గ్యాంగ్ స్టర్గా మారిన జిమ్మీ చెరిజియన్ చాలా కాలంగా ఆ దేశంలో భయంకరమైన హింసకు పాల్పడుతున్నాడని అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ప్రత్యర్థులను క్రూరంగా సజీవ దహనం చేసి చంపడం వంటి చేస్తుంటాడు. G9 ఫ్యామిలీ అండ్ మిల్లీస్ అనే శక్తివంతమైన ముఠా కూటమికి నాయకత్వం వహిస్తున్న చెరిజియర్, 2018లో లా సెలైన్లో జరిగి మారణకాండకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలో ఏకంగా 70 మందికి పైగా మరణించారు. మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. తాను పేదల రక్షకుడిగా చెప్పుకోవడంతో ప్రజల మద్దతు పొందుతున్నారు.
పోలీస్ ఫోర్స్ నుంచి తొలగించబడిన తర్వాత, చెరిజియన్ G9ని స్థాపించాడు. ఇటీవల కాలంలో ఈ సంస్థ పౌర హత్యలకు పాల్పడుతోంది. చెరిజియర్, మాజీ ప్రెసిడెంట్ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. 2021లో హైతీలో అధ్యక్షుడి హత్య జరిగింది. అప్పటి నుంచి ఆ దేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. G9తో సహా ముఠాలు ఇప్పుడు దేశ రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్లో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తున్నాయి. కిడ్నాప్, హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయి. ఆహార కొరత, వ్యాధుల వ్యాప్తి, ఇంధన సంక్షోభం వల్ల ఈ హింస తీవ్రమైంది. కరుడుగట్టిన ఖైదీలు జైలు నుంచి బయటకు రావడంత సంక్షోభంలో ఉన్న హైతీని మరింత ప్రమాదంలోకి నెడుతుందని అధికారులు భయపడుతున్నారు. యూఎన్, ఎఎస్ ఆంక్షల్లో ఉన్న ఐదుగురు ముఠా నాయకుల్లో చెరిజియర్ ఒకరు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?