Haiti: ఎవరీ జిమ్మి చెరిజియర్.. గ్యాంగ్స్టర్కి వణుకుతున్న హైతీ దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haiti: కరేబియన్ ప్రాంతంలో అత్యంత పేదదేశంగా ఉన్న హైతీ ప్రస్తుతం ప్రమాదం అంచున ఉంది. ఆ దేశంలో ప్రస్తుతం గ్యాంగ్స్టర్ ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం పొంచిఉంది. జిమ్మి చెరిజియర్, ‘‘బార్బెక్యూ’’గా పిలువబడే క్రూరమైన గ్యాంగ్ లీడర్, ఇటీవల 3700 మంది ఖైదీలను విడిపించడంతో ఒక్కసారిగా ఆ దేశం ఉలిక్కిపడింది. ఆ దేశ అధినేత కెన్యా పర్యటనలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో హైతీ దేశానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
Read Also: Chiranjeevi: ముకేశ్ అంబానీ ఇప్పుడు చేశాడు.. కానీ, చిరు ఎప్పుడో చేశాడు.. అది మెగాస్టార్ అంటే..
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
మాజీ పోలీస్ అధికారి నుంచి గ్యాంగ్ స్టర్గా మారిన జిమ్మీ చెరిజియన్ చాలా కాలంగా ఆ దేశంలో భయంకరమైన హింసకు పాల్పడుతున్నాడని అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ప్రత్యర్థులను క్రూరంగా సజీవ దహనం చేసి చంపడం వంటి చేస్తుంటాడు. G9 ఫ్యామిలీ అండ్ మిల్లీస్ అనే శక్తివంతమైన ముఠా కూటమికి నాయకత్వం వహిస్తున్న చెరిజియర్, 2018లో లా సెలైన్లో జరిగి మారణకాండకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలో ఏకంగా 70 మందికి పైగా మరణించారు. మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. తాను పేదల రక్షకుడిగా చెప్పుకోవడంతో ప్రజల మద్దతు పొందుతున్నారు.
పోలీస్ ఫోర్స్ నుంచి తొలగించబడిన తర్వాత, చెరిజియన్ G9ని స్థాపించాడు. ఇటీవల కాలంలో ఈ సంస్థ పౌర హత్యలకు పాల్పడుతోంది. చెరిజియర్, మాజీ ప్రెసిడెంట్ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. 2021లో హైతీలో అధ్యక్షుడి హత్య జరిగింది. అప్పటి నుంచి ఆ దేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. G9తో సహా ముఠాలు ఇప్పుడు దేశ రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్లో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తున్నాయి. కిడ్నాప్, హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయి. ఆహార కొరత, వ్యాధుల వ్యాప్తి, ఇంధన సంక్షోభం వల్ల ఈ హింస తీవ్రమైంది. కరుడుగట్టిన ఖైదీలు జైలు నుంచి బయటకు రావడంత సంక్షోభంలో ఉన్న హైతీని మరింత ప్రమాదంలోకి నెడుతుందని అధికారులు భయపడుతున్నారు. యూఎన్, ఎఎస్ ఆంక్షల్లో ఉన్న ఐదుగురు ముఠా నాయకుల్లో చెరిజియర్ ఒకరు.
తాజావార్తలు
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!