కరోనా మహమ్మారి దేశంలో కొంత తగ్గుముఖం పట్టింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తొలి వేవ్ ను సమర్ధవంతంగా కంట్రోల్ చేసిన కేరళలో సెకండ్ వేవ్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో పాజిటీవ్ కేసులు పెద్దసంఖ్యలోనే నమోదవుతున్నాయి. కేరళతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, చత్తీస్గడ్, మణిపూర్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు కేంద్ర బృందాన్ని పంపింది. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి తీసుకొవాలసిన జాగ్రత్తలు, కేసులు పెరగడానికి గల కారణాలను విశ్లేషిస్తుంది.