రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 14 రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు, ఎంపీలు హాజరయ్యారు. కేంద్రంపై ఉమ్మడిపోరును సాగించేందుకు అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా పెగాసస్ స్పైవేర్ అంశంపై విపక్షాలు పట్టుబడుతున్నారు. దీంతో పాటుగా ప్రజాసమస్యలపై ఉమ్మడిగా పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాయి. బిల్లులపై సమగ్రంగా చర్చించకుండానే ఆమోదించుకోవడంపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి. Read: సల్మాన్ భాయ్ లాగే నేనూ వర్జిన్… హీరో…
దేశంలో ప్రస్తుతం ఉన్న 545 పార్లమెంట్ స్థానాలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న కేంద్ర 545 స్థానాలను 1000 కి పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు తనతో ఈ విషయం గురించి చెప్పారని, మనీష్ తివారీ పేర్కొన్నారు. అందుకోసమే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్లోని లోక్ సభను 1000 మంది కూర్చుకే…
మనదగ్గర స్మార్ట్ఫోన్ ఉంటే చాలు… అందులో తప్పని సరిగా వాట్సప్ ఉండి తీరుతుంది. వాట్సప్కు కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. అయితే, ఈ వాట్సప్ ఎంత వరకు సురక్షితం. యూజర్ల డేటాకు ఎంత వరకు భరోసా ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ సురక్షితం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ వాట్సప్ విదేశీసంస్థకు చెందినది కావడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. వాట్సప్కు పోటీగా ఎన్ని షార్ట్ మెసేజ్ యాప్లు వచ్చినా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా భారత…
వైద్యవిద్యా కోర్సులకు సంబందించి రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కేంద్రం పేర్కొన్నది. యూజీ, పీజీ, దంతవైద్య విద్యాకోర్సులకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని అన్నారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. దేశంలో సామాజిక న్యాయంలో కొత్త అధ్యాయనం మొదలైందని ప్రధాని మోడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏడాది కాలంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చినట్టు ప్రధాని తెలిపారు. వైద్యవిద్యలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్…
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కుప్పకూలిన, ఆర్ధిక మోసాలకు గురైన బ్యాంకు డిపాజిటర్లకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ చట్టంలో సవరణలను క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్లకు వారి మొత్తం డిపాజిట్లపై రూ. 5 లక్షల భీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభావిత బ్యాంక్ తాత్కాలిక నిషేదానికి గురైన 90 రోజుల్లో ఈ భీమా లభిస్తుంది. దివాలా తీసిన బ్యాంకులపై ఆర్బీఐ తాత్కాలిక నిషేదం విధించిన తరువాత…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం కావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా వేగవంతం చేశారు. అయితే, అవసరమైనన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం లేదని, వ్యాక్సిన్లు సరిపడా అందించాలని అనేక రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, వ్యాక్సిన్ విషయంలో కేంద్రానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ రాయనున్నారు. సరిపడా వ్యాక్సిన్లు అందించాలని కోరుతూనే, ప్రైవేట్ ఆసుపత్రులకు కేటాంచిన డోసుల్ని ఆయా ఆసుపత్రులు సరిగా వినియోగించుకోలేకపోతున్నాయని కేంద్రం దృష్టికి…
కరోనా మహమ్మారి దేశంలో కొంత తగ్గుముఖం పట్టింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తొలి వేవ్ ను సమర్ధవంతంగా కంట్రోల్ చేసిన కేరళలో సెకండ్ వేవ్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో పాజిటీవ్ కేసులు పెద్దసంఖ్యలోనే నమోదవుతున్నాయి. కేరళతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, చత్తీస్గడ్, మణిపూర్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు కేంద్ర బృందాన్ని పంపింది. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి…
కరోనా మహమ్మారి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా విజృంభించిన సమయంలో రేషన్ను ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. మే, జూన్ నెలలకు కూడా కేంద్రం ఉచితంగా రేషన్ను అందించింది. కాగా, ఈ రేషన్ మరో 5 నెలలపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జులై నెల నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్ను అందించాలని నిర్ణయం తీసుకుంది. Read: ‘తిరై ఇసై చక్రవర్తి’ ఎమ్మెస్ విశ్వనాథన్! బియ్యం రేషన్ కార్డు ఉన్నవారికి ఇంట్లో…
సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకోసం కొత్త నిబందనలను కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబందనలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి. కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త ఐటి నిబందనలు యూజర్ల గోప్యతకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే కేంద్రం తీసుకొచ్చిన నిబందలను అడ్డుకోవాలని కోరుతూ వాట్సాప్ డిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దేశ భద్రతకు లేదా ప్రజలకు హాని కలిగించే విధంగా ఏవైనా పోస్టులను పెడితే ఆ వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేలా కొత్త నిబందనలు…