Bombay High Court: “పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి”.. శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి..
- భారత్లో ఎక్కువ కాలంగా ఉంటున్న శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: భారత ప్రభుత్వం ‘‘దేశం వదిలి వెళ్లాలి’’ అని నోటీసులు జారీ చేసినప్పటికీ యెమెన్కి చెందిన వ్యక్తి ఇండియాలో ఉండటంపై బాంబే హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పాకిస్తాన్ లేదా గల్ఫ్ దేశాలకు వెళ్లాలి’’ అంటూ న్యాయమూర్తి అన్నారు. భారతదేశ ఉదారవాద వైఖరిని శరణార్థులు ‘అనవసర ప్రయోజనాలకు’ ఉపయోగించుకోలేరని న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, పృథ్వీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.
యెమెన్ దేశానికి చెందిన పిటిషనర్ ఖాలీద్ గోమాయి మహ్మద్ హసన్ భారతదేశంలో ఎక్కువ కాలం ఉండటంతో, ‘భారత్ నుండి వెళ్లిపోండి’ నోటీసుల్ని అధికారులు జారీ చేశారు. అయితే, ఈ బలవంతపు బహిష్కరణ నుంచి కొంత ఉపశమనం కావాలని అతను బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. తాను ఆస్ట్రేలియా వెళ్లాలని అనుకుంటున్నానని కొంత సమయం కావాలని కోరారు. ‘రెఫ్యూజీ’ కార్డు హోల్డర్ అయిన పిటిషనర్ హసన్కు పూణే పోలీసులు ‘లీవ్ ఇండియా నోటీసు’ అందించారు. శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి హైకమిషన్ (UNHCR) వారికి శరణార్థి కార్డును జారీ చేసింది.
Also Read
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- CM Vijay: సీఎం విజయ్కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. 'రెండు ఆకుల' రాజకీయంలో దళపతి వెనకడుగు!
- Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ".. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
Read Also: Donald Trump: ఆమె భారతీయురాలా..? నల్లజాతీయురాలా?.. కమలా హారిస్ని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు..
తన దేశం యెమెన్ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, గత 10 ఏళ్లుగా భారత్లో నివసిస్తు్న్నానని, అంతర్గత అంతర్యుద్ధం కారణంగా 4.5 మిలియన్ల ప్రజలు నిరాశ్రయయ్యారని హసన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తన బహిరంగ బహిష్కరణ భార్య, పిల్లల ప్రాణాల్ని రిస్కులో పడేస్తుందని చెప్పారు. ప్రతిపాదిత బహిష్కరణ అంతర్జాతీయ ఆచార చట్టాలకు మరియు భారత రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కోర్టులో వాదించారు.
హసన్ విద్యార్థి వీసాపై మార్చి 2014లో భారత్కు రాగా, అతని భార్య మే 2015లో మెడికల్ వీసాపై వచ్చారు. ఈ జంట వీసాల గడువు వరుసగా ఫిబ్రవరి 2017 మరియు సెప్టెంబర్ 2015లో ముగిసింది. పూణే పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో లీవ్ ఇండియా నోటీసులు జారీ చేశారు. 14 రోజుల్లో భారత్ వదిలేయాలని ఆదేశించారు. పిటిషనర్లు ఆస్ట్రేలియాకు వీసా పొందే వరకు బహిష్కరణ నుండి రక్షణ కోరారు. శరణార్థి కార్డు హోల్డర్లను అనుమతించే 129 ఇతర దేశాలకు పిటిషనర్ వెళ్లవచ్చని పూణే పోలీసుల తరఫున వాదిస్తున్న ప్రత్యేక న్యాయవాది సందేశ్ పాటిల్తో ధర్మాసనం అంగీకరించింది. తాము మీకు 15 రోజుల కన్నా ఎక్కువ సమయం రక్షణ కల్పించలేమని కోర్టు చెప్పింది.
తాజావార్తలు
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!