Bombay High Court: “పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి”.. శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి..
- భారత్లో ఎక్కువ కాలంగా ఉంటున్న శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: భారత ప్రభుత్వం ‘‘దేశం వదిలి వెళ్లాలి’’ అని నోటీసులు జారీ చేసినప్పటికీ యెమెన్కి చెందిన వ్యక్తి ఇండియాలో ఉండటంపై బాంబే హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పాకిస్తాన్ లేదా గల్ఫ్ దేశాలకు వెళ్లాలి’’ అంటూ న్యాయమూర్తి అన్నారు. భారతదేశ ఉదారవాద వైఖరిని శరణార్థులు ‘అనవసర ప్రయోజనాలకు’ ఉపయోగించుకోలేరని న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, పృథ్వీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.
యెమెన్ దేశానికి చెందిన పిటిషనర్ ఖాలీద్ గోమాయి మహ్మద్ హసన్ భారతదేశంలో ఎక్కువ కాలం ఉండటంతో, ‘భారత్ నుండి వెళ్లిపోండి’ నోటీసుల్ని అధికారులు జారీ చేశారు. అయితే, ఈ బలవంతపు బహిష్కరణ నుంచి కొంత ఉపశమనం కావాలని అతను బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. తాను ఆస్ట్రేలియా వెళ్లాలని అనుకుంటున్నానని కొంత సమయం కావాలని కోరారు. ‘రెఫ్యూజీ’ కార్డు హోల్డర్ అయిన పిటిషనర్ హసన్కు పూణే పోలీసులు ‘లీవ్ ఇండియా నోటీసు’ అందించారు. శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి హైకమిషన్ (UNHCR) వారికి శరణార్థి కార్డును జారీ చేసింది.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Donald Trump: ఆమె భారతీయురాలా..? నల్లజాతీయురాలా?.. కమలా హారిస్ని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు..
తన దేశం యెమెన్ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, గత 10 ఏళ్లుగా భారత్లో నివసిస్తు్న్నానని, అంతర్గత అంతర్యుద్ధం కారణంగా 4.5 మిలియన్ల ప్రజలు నిరాశ్రయయ్యారని హసన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తన బహిరంగ బహిష్కరణ భార్య, పిల్లల ప్రాణాల్ని రిస్కులో పడేస్తుందని చెప్పారు. ప్రతిపాదిత బహిష్కరణ అంతర్జాతీయ ఆచార చట్టాలకు మరియు భారత రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కోర్టులో వాదించారు.
హసన్ విద్యార్థి వీసాపై మార్చి 2014లో భారత్కు రాగా, అతని భార్య మే 2015లో మెడికల్ వీసాపై వచ్చారు. ఈ జంట వీసాల గడువు వరుసగా ఫిబ్రవరి 2017 మరియు సెప్టెంబర్ 2015లో ముగిసింది. పూణే పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో లీవ్ ఇండియా నోటీసులు జారీ చేశారు. 14 రోజుల్లో భారత్ వదిలేయాలని ఆదేశించారు. పిటిషనర్లు ఆస్ట్రేలియాకు వీసా పొందే వరకు బహిష్కరణ నుండి రక్షణ కోరారు. శరణార్థి కార్డు హోల్డర్లను అనుమతించే 129 ఇతర దేశాలకు పిటిషనర్ వెళ్లవచ్చని పూణే పోలీసుల తరఫున వాదిస్తున్న ప్రత్యేక న్యాయవాది సందేశ్ పాటిల్తో ధర్మాసనం అంగీకరించింది. తాము మీకు 15 రోజుల కన్నా ఎక్కువ సమయం రక్షణ కల్పించలేమని కోర్టు చెప్పింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!