Bengaluru: బెంగళూర్ నగరంలో అక్రమంగా 600 మంది విదేశీయులు తిష్ట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్ నగరంలో వీసా గడువు ముగిసినప్పటికీ 600 మందికి పైగా విదేశీయులు తిష్ట వేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరందరినీ వారి దేశాలకు వాపసు పంపేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్కు చెందిన యువతిని ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు వివాహమాడి బెంగళూరులో కాపురం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చాక నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాక్ యువతిని స్వదేశానికి తిప్పి పంపిన తరహాలోనే నగరంలో తిష్టవేసిన ఆఫ్రికా దేశాలకు చెందిన వారిని కూడా వాపసు పంపే ప్రయత్నాలు చేపట్టినట్టు నగర పోలీసు యంత్రాంగం వెల్లడించింది. బెంగళూరులో అక్రమంగా తిష్ట వేసిన 400 మందికి పైగా విదేశీయులపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వీరిలో కొందరు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మరికొందరు బెయిల్పై బయటకు వచ్చారని పోలీసు వర్గాలు అంటున్నాయి.
బెంగళూరులో అక్రమంగా తిష్టవేసిన విదేశీయుల్లో ఇంతవరకు 34 మందిని గుర్తించి వారి దేశాలకు తిప్పి పంపారు. వీరిలో ఆఫ్రికా, నైజీరియా, బంగ్లాదేశ్ వాసులు ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరో 50 మందిని అదుపులోకి తీసుకుని బెంగళూరు నగర శివారులోని నెలమంగల సొండేకొప్ప డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం అందించారు. అటువైపు నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే మరో నెలరోజుల్లో వీరిని కూడా తిప్పి పంపాలని భావిస్తున్నారు.
Also Read
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
Read Also: Petrol Rates: హెచ్చుతగ్గుల్లో పెట్రో ధరలు.. రానున్న రోజుల్లో మంటలే
రాజధాని నగరంలోని తూర్పు ప్రాంతాలైన బాణసవాడి, రామమూర్తినగర్, హెణ్ణూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆఫ్రికా దేశాలకు చెందినవారు పెద్దసంఖ్యలో నివసిస్తున్నారు. వీరిలో 40 మంది వీసా గడువు ముగిసినా కూడా తిష్ట వేసినట్టు గుర్తించిన ఈశాన్య విభాగం పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రెండో విడత తనిఖీలు చేపట్టాల్సిందిగా నగర పోలీసులకు హోంశాఖ నుంచి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది.
నెలమంగలలోని సొండేకొప్ప డిటెన్షన్ సెంటర్లో కేవలం 50 మందిని మాత్రమే ఉంచేందుకు అవకాశం ఉంది. అక్రమంగా తిష్ట వేసిన విదేశీ మహిళలను తుమకూరులో ఉంచేందుకు వీలుగా అక్కడ ఒక డిటెన్షన్ కేంద్రం, బెంగళూరు నగరంలో మరో డిటెన్షన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర హోంశాఖ విదేశీయుల రిజిస్ట్రేషన్ ప్రాంతీయ కార్యాలయం (ఎఫ్ఆర్ఆర్ఓ) అధికారులను కోరినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు.
వీసా గడువు ముగిసినప్పటికీ నగరంలో తిష్ట వేసిన విదేశీయులను ఒక్కసారిగా విదేశాలకు పంపడం సాధ్యం కాదని ఇదొక సుదీర్ఘ ప్రక్రియ అని జాయింట్ పోలీస్ కమిషనర్ శరణప్ప అంటున్నారు. వీసా అవధి ముగిసిన విదేశీయుల కదలికలపై డేగకన్ను వేసి ఉంచామన్నారు. ప్రత్యేకించి ఇలా అక్రమంగా నివసిస్తున్నవారిలో కొందరు మాదక ద్రవ్యాల వ్యవహారం, వ్యభిచార కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్టు తేలిందన్నారు. విదేశీయులను తిప్పి పంపేందుకు తొలుత ఆ దేశ రాయబార కార్యాలయాలతో చర్చించాల్సి ఉంటుందని, ఈలోపు వారిపై మనదేశంలో దాఖలైన క్రిమినల్ కేసులు క్లియర్ కావాల్సి ఉంటుందని శరణప్ప వివరించారు. పైగా అక్రమంగా తిష్ట వేసిన విదేశీయులను తిరిగి స్వీకరించేందుకు ఆయా దేశాలు అంగీకరించాల్సి ఉంటుందని, వారి ప్రయాణ ఖర్చులు భరించాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రధాన కారణాల వల్లనే విదేశీయులు అక్రమంగా తిష్ట వేసినా వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..