UP: యూపీలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
- ఉత్తరప్రదేశ్లో ఘోరం
- ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
- 3 తుపాకీలు స్వాధీనం.. సీసీకెమెరాలు పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఘోరం జరిగింది. ఒకే కుటంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సహరాన్పూర్లో మృతదేహాల కలకలం రేగడంతో పోలీసులు సమాచారం అందుకుని మృతదేహాలను పరిశీలించారు. అయితే మృతదేహాల నుదిటిపై తూటాల గుర్తులు కనిపించాయి. అంతేకాకుండా సంఘటనాస్థలిలో 3 తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో కుటుంబ యజమాని అశోక్ ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపి.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తు్న్నారు. అప్పులు లేదా కుటుంబ సమస్యల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
ఇది కూడా చదవండి: Tamil Nadu: స్టాలిన్ సర్కార్కు గవర్నర్ షాక్.. ప్రసంగించకుండా అసెంబ్లీ నుంచి వాకౌట్
అశోక్ మొదట తల్లి విద్యావతిని.. అనంతరం భార్య అంజితను, అటు తర్వాత ఇద్దరు కుమారులైన కార్తీక్, దేవ్ను కాల్చి చంపినట్లుగా భావిస్తున్నారు. అశోక్, భార్య అంజిత మృతదేహాలు నేలపై ఉండగా.. మిగతా ముగ్గురు మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. అంటే నిద్రలో ఉండగా ఈ ఘతుకానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. దేవ్ పట్టణంలో 9వ తరగతి చదువుతుండగా.. కార్తీక్ 10వ తరగతి చదువుతున్నాడు. అయితే కుటుంబానికి ఎవరితోనూ విభేదాలు లేవని.. ప్రశాంతంగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. ఎవరైనా వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సీసీకెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటిని సీజ్ చేసి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు తీవ్ర వార్నింగ్.. మునుపెన్నడూ చూడని శక్తిని చూస్తారని హెచ్చరిక
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!