UP: యూపీలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
- ఉత్తరప్రదేశ్లో ఘోరం
- ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
- 3 తుపాకీలు స్వాధీనం.. సీసీకెమెరాలు పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఘోరం జరిగింది. ఒకే కుటంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సహరాన్పూర్లో మృతదేహాల కలకలం రేగడంతో పోలీసులు సమాచారం అందుకుని మృతదేహాలను పరిశీలించారు. అయితే మృతదేహాల నుదిటిపై తూటాల గుర్తులు కనిపించాయి. అంతేకాకుండా సంఘటనాస్థలిలో 3 తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో కుటుంబ యజమాని అశోక్ ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపి.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తు్న్నారు. అప్పులు లేదా కుటుంబ సమస్యల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ఇది కూడా చదవండి: Tamil Nadu: స్టాలిన్ సర్కార్కు గవర్నర్ షాక్.. ప్రసంగించకుండా అసెంబ్లీ నుంచి వాకౌట్
అశోక్ మొదట తల్లి విద్యావతిని.. అనంతరం భార్య అంజితను, అటు తర్వాత ఇద్దరు కుమారులైన కార్తీక్, దేవ్ను కాల్చి చంపినట్లుగా భావిస్తున్నారు. అశోక్, భార్య అంజిత మృతదేహాలు నేలపై ఉండగా.. మిగతా ముగ్గురు మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. అంటే నిద్రలో ఉండగా ఈ ఘతుకానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. దేవ్ పట్టణంలో 9వ తరగతి చదువుతుండగా.. కార్తీక్ 10వ తరగతి చదువుతున్నాడు. అయితే కుటుంబానికి ఎవరితోనూ విభేదాలు లేవని.. ప్రశాంతంగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. ఎవరైనా వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సీసీకెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటిని సీజ్ చేసి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు తీవ్ర వార్నింగ్.. మునుపెన్నడూ చూడని శక్తిని చూస్తారని హెచ్చరిక
తాజావార్తలు
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!