UP: యూపీలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
- ఉత్తరప్రదేశ్లో ఘోరం
- ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
- 3 తుపాకీలు స్వాధీనం.. సీసీకెమెరాలు పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఘోరం జరిగింది. ఒకే కుటంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సహరాన్పూర్లో మృతదేహాల కలకలం రేగడంతో పోలీసులు సమాచారం అందుకుని మృతదేహాలను పరిశీలించారు. అయితే మృతదేహాల నుదిటిపై తూటాల గుర్తులు కనిపించాయి. అంతేకాకుండా సంఘటనాస్థలిలో 3 తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో కుటుంబ యజమాని అశోక్ ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపి.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తు్న్నారు. అప్పులు లేదా కుటుంబ సమస్యల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఇది కూడా చదవండి: Tamil Nadu: స్టాలిన్ సర్కార్కు గవర్నర్ షాక్.. ప్రసంగించకుండా అసెంబ్లీ నుంచి వాకౌట్
అశోక్ మొదట తల్లి విద్యావతిని.. అనంతరం భార్య అంజితను, అటు తర్వాత ఇద్దరు కుమారులైన కార్తీక్, దేవ్ను కాల్చి చంపినట్లుగా భావిస్తున్నారు. అశోక్, భార్య అంజిత మృతదేహాలు నేలపై ఉండగా.. మిగతా ముగ్గురు మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. అంటే నిద్రలో ఉండగా ఈ ఘతుకానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. దేవ్ పట్టణంలో 9వ తరగతి చదువుతుండగా.. కార్తీక్ 10వ తరగతి చదువుతున్నాడు. అయితే కుటుంబానికి ఎవరితోనూ విభేదాలు లేవని.. ప్రశాంతంగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. ఎవరైనా వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సీసీకెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటిని సీజ్ చేసి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు తీవ్ర వార్నింగ్.. మునుపెన్నడూ చూడని శక్తిని చూస్తారని హెచ్చరిక
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!