PM Modi: ‘‘ అంబేద్కర్ తిరిగి వచ్చినా..’’ రాజ్యాంగంపై ప్రతిపక్షాల ఆరోపణలపై మోడీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, వీటిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మహారాష్ట్ర నాగ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్కి ప్రత్యేక హోదా రద్దు చేసినందుకు బీఆర్ అంబేద్కర్ తనను తప్పక ఆశీర్వదిస్తారని ప్రధాని మోడీ అన్నారు. ‘‘రాజ్యాంగంలో చాలా ముఖ్యమైనది అయితే, ఆర్టికల్ 370 రద్దు చేసేంత వరకు దేశం మొత్తం ఒకే రాజ్యాంగం ఎందుకు అమలులోకి రాలేదు..? వేర్పాటువాదుల పట్ల మెతక వైఖరితో ప్రతిపక్షాలు ఇలా చేశాయి’’ అని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంబేద్కర్ ఆత్మ మోడీని ఆశీర్వదిస్తుందని చెప్పారు.
Read Also: Middle East tensions: ఇజ్రాయిల్, ఇరాన్ వెళ్లొద్దని భారతీయులకు కేంద్రం కీలక ఆదేశాలు..
Also Read
బీజేపీ ప్రభుత్వానికి దేశ రాజ్యాంగమే సర్వస్వమని, బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా వ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీని విధించడం ద్వారా రాజ్యాంగాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తాము మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తాయని ప్రతిపక్షాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఎమర్జె్న్సీ సమయంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లలేదా..? అని కాంగ్రెస్ని ప్రశ్నించారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగే 7 దశల లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మొదటి దశలో ఎన్నికలు జరిగే మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జమ్మూకాశ్మీర్లో దళితులు, గిరిజనులకు ప్రస్తుతం రాజ్యాంగ హక్కులు లభించాయని, కాంగ్రెస్ హయాంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వారిని విస్మరించారని ప్రధాని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?