Edible oil prices: దిగిరానున్న వంటనూనెల ధరలు.. దిగుమతి సుంకాన్ని తగ్గించిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Edible oil prices: ధరలతో అల్లాడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ముఖ్యంగా రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5కి తగ్గించింది ప్రభుత్వం. ఈ చర్యల వల్ల వంటనూనెల మార్కెట్లో స్థిరత్వం ఏర్పడటంతో పాటు ముడి, శుద్ధి చేసిన నూనెల దిగుమతుల మధ్య సమతుల్యత సాధించేందుకు దోహదం చేస్తుంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం గురువారం నుంచి ఈ చర్యలు అమలులోకి వస్తాయి.
భారతదేశం 60 శాతం వంట నూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ధరలు తగ్గే అవకాశం ఏర్పడింది. 2023 ఏప్రిల్ నెలలో భారత్ 1.05 మిలియన్ టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంది. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం ఎక్కువ.
Also Read
Read Also: Fire Accident: కోచింగ్ సెంటర్లో భారీగా చెలరేగిన మంటలు.. విద్యార్థులకు గాయాలు
భారత్ ప్రతీ ఏడాది దాదాపుగా 24 మిలియన్ టన్నుల ఆహార నూనెల్ని ఉపయోగిస్తుంది. ఇందులో దాదాపుగా 14 మిలియన్ టన్నుల్ని దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు క్రూడ్ పామాయిల్, క్రూడ్ సన్ ఫ్లవర్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్ పై దిగుమతి సుంకం 5 శాతం విధించబడుతుంది. రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్ పై ఫఫెక్టివ్ సుంకం 13.75 శాతంగా ఉంది. రిఫ్లైన్ ఆయిల్ పై 12.5 శాతం దిగుమతి సుంకంతో పాటు 10 శాతం సెస్ ఉంటుంది.
నవంబర్ 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు పామాయిల్ దిగుమతి భారీగా పెరిగింది. గతేడాదిలో ఇది 32 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే.. ఈ ఏడాది 59 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. ఈ కాలంలో పామాయిల్ దిగుమతి 61 శాతం పెరగ్గా, ఇతర నూనెల దిగుమతి వాటా 49 శాతానికి తగ్గింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!