Abhishek Banerjee : జూలై 9 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతా: అభిషేక్ బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee : పశ్చిమబెంగాల్లో జరిగిన టీచర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించిన కేసులో జూలై 9 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జూలై 8న జరగనున్నాయి.. ఆ తరువాత ఎప్పుడైనా విచారణకు హాజరవుతానని ఎంపీ ఈడీకి తెలిపారు. టీచర్స్ రిక్రూట్మెంట్ కేసులో ఈ నెల 13న ఉదయం 11:30 గంటలకు విచారణకు జరుకావాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో తాను ఎన్నికల ప్రచారంలో ఉండాల్సి ఉన్నందున జులై 9 తరువాత ఎప్పుడైనా ఈడీ విచారణకు హాజరవుతానని తెలిపారు.
Read also:Tirumala : తిరుమల ఘాట్ రోడ్డు వద్ద మరో ప్రమాదం..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున విచారణ కోసం ED ముందు హాజరుకాలేనని అభిషేక్ బెనర్జీ తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన జూలై 9 తర్వాత ఎప్పుడైనా హాజరవుతానని తెలిపారు. తాను జూన్ 13న ఈడీ ముందు హాజరుకాలేనని.. కీలకమైన పంచాయతీ ఎన్నికలకు ముందు ఈడీ ముందు హాజరయ్యేందుకు సమయం లేదన్నారు. జూలై 9న పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయని.. ఆ తర్వాత ఎప్పుడైనా హాజరవుతానని ఆయన చెప్పారు. తనకు ఈడీ సమన్లు పంపడం పంచాయతీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచేందుకు బీజేపీ ఉ ద్దేశపూర్వంగా చేసిన పన్నాగమన్నారు. రాజకీయంగా బీజేపీ పోరాడలేక నన్ను ప్రచారానికి దూరంగా ఉంచేందుకు పన్నిన కుట్ర అన్నారు.
Read also: Extra Marital affair: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్ హోల్ లో దాచిన ప్రియుడు
గత నెలలో ఉపాధ్యాయుల నియామక స్కామ్లో అభిషేక్ బెనర్జీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించింది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు కలకత్తా హైకోర్టు కేంద్ర ఏజెన్సీలకు అనుమతి ఇచ్చింది. తాను బిజెపిలో చేరితే వజ్రంలాగా బయటకు వచ్చేవాడినని ఎంపీ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా శారద, నారద, టెట్ స్కామ్లపై దర్యాప్తు చేస్తున్నారని వాటి నుంచి ఎంత మేరకు ఫలితం వచ్చిందని ప్రశ్నించారు. తాను బీజేపీలో చేరనని.. తను ఎవరికి తల వంచనని.. రాయల్ బెంగాల్ టైగర్గా బతుకుతానని అభిషేక్ చెప్పారు.
Read also: Wrestlers : రెజ్లర్లకు క్లీన్ చీట్ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్
గత ఏడాది మేలో, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC) మరియు పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా నాన్ టీచింగ్ స్టాఫ్ (గ్రూప్ సి మరియు డి) మరియు టీచింగ్ స్టాఫ్ నియామకంపై విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని ఆదేశించింది. 2014 మరియు 2021 మధ్య. ఎంపిక పరీక్షల్లో విఫలమైన తర్వాత ఉద్యోగాలు పొందేందుకు నియమితులైన వారు రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు లంచాలు ఇచ్చారని ఆరోపించారు.
2014 మరియు 2021 మధ్య పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని నియమించడానికి ఉద్యోగ ఆశావహుల నుండి టిఎంసి నాయకులు రూ. 100 కోట్లకు పైగా సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!