Tamil Nadu: తమిళనాడులో మరో మంత్రి ఇంటిపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్ కేసులో దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: దేశ వ్యాప్తంగా మనీలాండరింగ్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ) దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడైతే డబ్బు ఎక్కువ మొత్తంలో అవినీతిగా బయటికొచ్చిందో అక్కడ.. మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలు, ఫిర్యాదులు అందుతుండటంతో ఈడీ దాడులు చేస్తోంది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కూడా పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని.. దాంతో ఈడీ పేపర్ లీకేజీకి సంబంధించి అనుమానితులుగా ఉన్న వారిని విచారించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో గత నెలలో ఒక మంత్రి ఇంటిపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు తాజా తమిళనాడులో మరో మంత్రి ఇంటిపై ఈడీ దాడులు చేసింది. మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉందనే ఆరోపణలతో ఈడీ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఒక మంత్రి ఇంటిపై దాడులు చేసిన ఈడీ ఆ తరువాత మంత్రిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో అధికారపార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై సీఎం స్టాలిన్ కేబినెట్లోని మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరో మంత్రి ఇంటిపై దాడులు చేస్తున్నది. మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కే.పొన్ముడి తోపాటు ఆయన కుమారుడు కల్లకురిచి ఎంపీ గౌతమ్ సిగమణి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైతోపాటు విల్లుపురంలోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి.
Read also: Delivery Service Fraud: వీడు మామూలోడు కాదు.. డెలివరీ సర్వీస్ పేరుతో ఘరానా మోసం
Also Read
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
2007 నుంచి 2011 వరకు గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్ముడి.. క్వారీ లైసెన్స్ షరతులు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.28 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసు విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలైన మంత్రి కే.పొన్ముడి పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. రాజకీయ వేధింపులలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ దాడులకు పాల్పడుతుందని డీఎంకే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ రోజు బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల కూటమి సమావేశానికి ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరుకానున్న నేపథ్యంలో ఈడీ ఈ దాడులు నిర్వహించడంపై డీఎంకే నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే బీజేపీ రాష్ట్రంలో ఈడీ దాడులు చేయిస్తోందని డీఎంకే నేతలు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!