Tamil Nadu: తమిళనాడులో మరో మంత్రి ఇంటిపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్ కేసులో దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: దేశ వ్యాప్తంగా మనీలాండరింగ్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ) దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడైతే డబ్బు ఎక్కువ మొత్తంలో అవినీతిగా బయటికొచ్చిందో అక్కడ.. మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలు, ఫిర్యాదులు అందుతుండటంతో ఈడీ దాడులు చేస్తోంది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కూడా పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని.. దాంతో ఈడీ పేపర్ లీకేజీకి సంబంధించి అనుమానితులుగా ఉన్న వారిని విచారించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో గత నెలలో ఒక మంత్రి ఇంటిపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు తాజా తమిళనాడులో మరో మంత్రి ఇంటిపై ఈడీ దాడులు చేసింది. మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉందనే ఆరోపణలతో ఈడీ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఒక మంత్రి ఇంటిపై దాడులు చేసిన ఈడీ ఆ తరువాత మంత్రిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో అధికారపార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై సీఎం స్టాలిన్ కేబినెట్లోని మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరో మంత్రి ఇంటిపై దాడులు చేస్తున్నది. మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కే.పొన్ముడి తోపాటు ఆయన కుమారుడు కల్లకురిచి ఎంపీ గౌతమ్ సిగమణి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైతోపాటు విల్లుపురంలోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి.
Read also: Delivery Service Fraud: వీడు మామూలోడు కాదు.. డెలివరీ సర్వీస్ పేరుతో ఘరానా మోసం
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
2007 నుంచి 2011 వరకు గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్ముడి.. క్వారీ లైసెన్స్ షరతులు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.28 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసు విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలైన మంత్రి కే.పొన్ముడి పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. రాజకీయ వేధింపులలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ దాడులకు పాల్పడుతుందని డీఎంకే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ రోజు బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల కూటమి సమావేశానికి ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరుకానున్న నేపథ్యంలో ఈడీ ఈ దాడులు నిర్వహించడంపై డీఎంకే నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే బీజేపీ రాష్ట్రంలో ఈడీ దాడులు చేయిస్తోందని డీఎంకే నేతలు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!