National Herald Case: వాయిదా వేయమన్న రాహుల్ గాంధీ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈడీ
‘నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత మూడు రోజులు వరుసగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే! మొత్తం 28 గంటల పాటు జరిపిన విచారణలో అధికారులు రాహుల్కి ఎన్నో ప్రశ్నలు సంధించారు. ఈరోజు (గురువారం) మాత్రం విచారణ నుంచి రాహుల్ గాంధీకి విరామం ఇచ్చారు. అయితే.. శుక్రవారం నాడు విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనంటూ ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది.
రాహుల్ గాంధీ మాత్రం ఈ విచారణను సోమవారానికి వాయిదా వేయాల్సిందిగా ఈడీని విజ్ఞప్తి చేశారు. తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమె ఆసుపత్రిలో ఉందని తెలిపారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని కలిసేందుకు వెళ్లాలని రాహుల్ విజ్ఞప్తి చేసినందుకే, గురువారం విచారణను నిలిపివేశారు. అతని విజ్ఞప్తి మేరకు విచారణకు బ్రేక్ ఇవ్వడంతో.. తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ తల్లి సోనియా గాంధీ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తల్లి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈడీ అతని విజ్ఞప్తిని అంగీకరిస్తూ, సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.
Also Read
ఇదిలావుండగా.. తమ అగ్రనేత రాహుల్ గాంధీని మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నిస్తుండడం పట్ల కాంగ్రెస్ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపడుతున్నాయి. ఇక ఖైరతాబాద్ అయితే రణరంగంగా మారింది. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్భవన్కు చేరుకోవడం, వారిని అడ్డుకునేందుకు పోలీసుల్ని మోహరించడంతో.. ఉత్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్కి నిప్పంటించడంతో పాటు బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో