Tamil Nadu: ‘‘మురుగన్ సదస్సు’’కు వెళ్లనున్న సీఎం యోగి, పవన్ కళ్యాణ్.. ప్రశ్నించిన డీఎంకే..
- మధురై మురుగన్ సదస్సుకు సీఎం యోగి, పవన్ కళ్యాణ్..
- తమిళనాడుతో వారికి ఏం సంబంధం అని డీఎంకే ప్రశ్నలు..
- మతం పేరులో బీజేపీ విభజిస్తోందని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు మధురై జిల్లాలో జరగనున్న ‘‘మురుగన్ సదస్సు’’ను ఉద్దేశిస్తూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కార్యక్రమం మతం, జాతి, భాష పేరుతో ప్రజలను విభజించడానికి రూపొందించారని విమర్శించింది. జూన్ 22న జరిగే ఈ సదస్సుకు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వంటి ఇతర రాష్ట్రాల నేతలు రావడాన్ని ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నేతలు రావడం ఏంటని తమిళనాడు హిందూ మత మరియు ధార్మిక శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు అడిగారు.
Read Also: Strait of Hormuz: “హార్మూజ్ జలసంధి”ని మూసేయాలని ఇరాన్ ప్లాన్.. ఇదే జరిగితే చమురు సంక్షోభం..
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు తమిళనాడు మధ్య సంబంధం ఏమిటి? యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు తమిళనాడు మధ్య సంబంధం ఏమిటి?” అని శేఖర్ బాబు పశ్నించారు. “దేవాలయాలు న్యాయం , క్రమశిక్షణను ప్రచారం చేయడమే. కానీ ఈ వ్యక్తుల సమావేశం జాతి, భాష, మతం ఆధారంగా విభజనలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాంటి సమావేశాలు అవసరం లేదని నేను భావిస్తున్నాను.” అని అన్నారు.
జూన్ 22న జరగబోయే మురుగన్ సదస్సుకు ముందు ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అధికార డీఎంకే దీనిని రాజకీయ ప్రేరేపిత సమావేశమని విమర్శించింది. అయితే, బీజేపీతో సహా ఏఐడీఎంకే పార్టీలు ఈ సమావేశాన్ని భక్తి వేడుకగా స్వాగతించాయి. జూన్ 8న మధురైలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. డీఎంకే మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని, కుమారస్వామి ఆరు పవిత్ర స్థలాల్లో ఒకటైన తిరుపరంకుండ్రం కొండ వివాదాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు.
తాజావార్తలు
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!