West Bengal Governor: ర్యాగింగ్ను గుర్తించే సాంకేతికతను కనుగొనండి.. ఇస్రోకి పశ్చిమ బెంగాల్ గవర్నర్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Governor: ర్యాగింగ్ నియంత్రణకు ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. దేశంలోని ఏదో ఒక విద్యా సంస్థలో ఏదో రూపంలో ర్యాగింగ్ భూతం బయటపడుతోంది. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ను కనుగొనే ఆధునిక సాంకేతికతను కనిపెట్టి.. ర్యాగింగ్ బారిని విద్యార్థులను రక్షించేలా చూడాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ కోరారు. ర్యాంగింగ్ను అడ్డుకునేందుకు అవసరమైన సాంకేతికతను గుర్తించేందుకు సాయం చేయాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో)కు విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్పై నిషేధం ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల ఇది కొనసాగుతూనే ఉంది. ఏటా ఎంతో మంది విద్యార్థులు ర్యాగింగ్ రక్కసికి బలైపోతున్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. ఈ క్రమంలోనే ర్యాంగింగ్కు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన సాంకేతికతను గుర్తించేందుకు సాయం చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ లేఖ రాసినట్లు రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Secretariat: సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన సీఎం.. ఒకే వేదికపై కేసీఆర్, గవర్నర్..
Also Read
- UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
కొద్దిరోజుల క్రితం పశ్చిమబెంగాల్లోని జాదవ్పుర్ విశ్వవిద్యాలయం (Jadavpur University)లో స్వప్నదీప్ అనే డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు స్వప్నదీప్ మృతికి సీనియర్ల వేధింపులే కారణమని తేల్చారు. ఈ మృతిపై యూనివర్శిటీ ఛాన్స్లర్ ఆనంద్ బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ర్యాగింగ్ను అడ్డుకునేందుకు సాంకేతిక సాయం అందించాలని ఇస్రోను కోరారు. క్యాంపస్లలో ర్యాగింగ్ను సమర్థవంతంగా నిరోధించడానికి మరియు తొలగించడానికి తగిన సాంకేతికతను గుర్తించడానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి వి ఆనంద బోస్ మరియు విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ను సంప్రదించారు. గవర్నర్ బోస్ హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ADRIN)తో కూడా చర్చించారు. సాంకేతికత వీడియో అనలిటిక్స్, ఇమేజ్ మ్యాచింగ్, ఆటోమేటిక్ టార్గెట్ రికగ్నిషన్ మరియు రిమోట్ సెన్సింగ్ వంటి బహుళ వనరులను ఉపయోగించాలని భావిస్తున్నారు. జాదవ్పూర్ యూనివర్శిటీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి వర్సిటీ హాస్టల్లోని బాల్కనీలో నుండి పడి మృతి చెందిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థి మృతికి సంబంధించి మొత్తం 12 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!