Digvijaya Singh: ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి, వారు ఎప్పుడూ జైలుకు వెళ్లరు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు…
- బద్ధ వ్యతిరేకి ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు నేర్చుకోవాలి..
- వారిని ఎదుర్కోవాలంటే వారి ఆటలోనే ఓడించాలి..
- కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digvijaya Singh: కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించే దిగ్విజయ్ సింగ్, ఆ సంస్థను పొగిడారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్, సంస్థాగత విస్తరణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ యూత్ కార్యకర్తలకు సూచించారు. మంగళవారం మధ్యప్రదేశ్ జబల్పూర్లో నీట్ పేపర్ లీకులపై జరిగిన నిరసనల్లో ఆయన పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఆర్ఎస్ఎస్ తమకు బద్ధ ప్రత్యర్థి అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోంది. వారు మైండ్ గేమ్ ఆడుతారు. వారు ఎప్పుడూ నిరసన చేయరు, ప్రదర్శనలు చేయరు, ఎప్పటికీ వారు లాఠీఛార్జ్లను ఎదుర్కోరు, జైళ్లకు వెళ్లరు. కానీ వారు మనల్ని జైలుకి పంపుతారు’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
READ ALSO: AP Weather: కొనసాగుతున్న అల్పపీడనం.. కోస్తాంధ్రకు 2 రోజుల పాటు భారీ వర్షసూచన
Also Read
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
అట్టడుగు స్థాయిలో సంస్థాగత నెట్వర్క్ లేకుంటే నిరసనలు ప్రభావంతంగా ఉండవని ఆయన అన్నారు. బూత్ నుంచి జిల్లా వరకు మూడు స్థాయిల్లో ఆందోళనలు నిర్వహించాలని సూచించారు. ‘‘ఆర్ఎస్ఎస్ సాధారణంగా మూడు విషయాలపై దృష్టిపెడుతుంది. కరపత్రాలను పంపిణీ చేస్తుంది. చర్చలు నిర్వహిస్తుంది. చివరకు ఉద్యమాన్ని నిర్మిస్తుంది. మీరు వారితో పోరాడాలంటే, వారి సొంత ఆటలో వారిని ఓడించాలి. శారీరకంగా కాదు మేధోపరంగా ఆట సాగాలి’’ అని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ కార్యనిర్వహణ మరియు ప్రచారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ప్రదర్శనపై ఆయన నిరాశ వ్యక్తం చేశారు. పార్టీ పరాజయానికి కారణాలను విశ్లేషించుకోవాలని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని బీజేపీ చెప్పగా, అది 250 సీట్లకు కూడా పడిపోయిందని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు వల్లే బీజేపీ మెజారిటీ వచ్చిందని సింగ్ పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషిని ఆయన విమర్శించారు, పరీక్షను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!