Deputy CM Pawan Kalyan: సనాతనాన్ని రక్షించడానికే శివసేన-జనసేన.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మహారాష్ట్రలోని డెగ్లూర్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం..
- శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉంది..
- జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతం..
- శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.. మహాయుతి కూటమి తరపున.. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే పార్టీ), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు.. ఈ రోజు మహారాష్ట్రలోని డెగ్లూర్లో మొదట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతంగా చెప్పుకొచ్చారు.. బాలా సాహెబ్ ఠాక్రే (బాల్ ఠాక్రే) నుంచి తాను ఎంతో నేర్చుకున్నాను.. శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇక, శివసేన-జనసేన అన్యాయంపై పోరాడతాయన్నారు.. ధైర్యం, పౌరుషంతో కూడిన భారత్ను బాలాసాహెబ్ కోరుకున్నారని గుర్తుచేశారు.. బాలాసాహెబ్ కలలు కన్న అయోధ్య రామమందిరాన్ని నిర్మించి చూపించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ప్రశంసలు కురిపించారు..
Read Also: Nayanthara Dhanush: హీరో ధనుష్ పై నయనతార సంచలన విమర్శలు.. నువ్వేంటో ఇప్పుడు తెలుస్తుంది
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం అన్నారు పవన్ కల్యాణ్.. అయితే, ఇప్పుడు దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతిలో ఉంది.. వీడిపోయి బలహీనపడదామా?.. లేదా కలిసి బలంగా నిలబడదామా?.. వీడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా? లేదా కలిసి బంగారు భవిష్యత్ను నిర్మించుకుందామా?.. విడిపోయి అరాచకత్వానికి స్థానం కల్పిద్దామా? లేక కలిసి అభివృద్ధి.. సంక్షేమం వైపు నడిపిద్దామా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. అయితే, మనం అందరం బాధ్యత గల పౌరులం.. ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!