Delhi Murder Case: సాక్షి హత్య కేసులో సాహిల్ పట్టించిన ఫోన్ కాల్.. నేరం ఒప్పుకున్న నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Murder Case: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక సాక్షి హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాహిల్ అనే 20 ఏళ్ల వ్యక్తి అత్యంత క్రూరంగా సాక్షిని 20 కన్నా ఎక్కువ సార్లు పొడిచి, బండరాయితో మోది హత్య చేశారు. ఈ హత్యకు మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. హత్య అనంతంర సాహిల్ అక్కడ నుంచి పారిపోయాడు. కానీ చివరకు ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. సాక్షిని హత్య చేసిన వెంటనే సాహిల్ ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లోని బందువుల ఇంటికి వెళ్లాడు. బస్సులో ప్రయాణించాడు. అయితే స్విచ్చాన్ చేసి తండ్రికి ఫోన్ చేయడంతో పోలీసులు సాహిల్ ఎక్కడున్నాడో గుర్తించి, లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు.
Read Also: Kishan Reddy: ఢిల్లీలోని పురానా ఖిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది..
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
మరోవైపు సాక్షి పోస్టుమార్టం నివేదిక, ఈ హత్య ఎంత క్రూరంగా జరిగిందనే విషయాలను వెల్లడిస్తోంది. పుర్రె భాగం మొత్తం పగిలిపోయినట్లు తేలింది. బండరాయితో మోదడంతో పుర్రె పూర్తిగా ఛిద్రమైంది. సాక్షితో సాహిల్ కు మూడేళ్లుగా పరిచయం ఉందని, అయితే ఇటీవల సాహిల్ ను దూరం పెట్టడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతడు, బాలికను దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు సాహిల్ కు హుక్కా, మద్యపానం అలవాటు ఉన్నట్లు అతని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా గుర్తించారు.
ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం జరిగిన విచారణలో నిందితుడు సాహిల్, 16 ఏళ్ల సాక్షిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీస్ వర్గాలు తెలిపాయి. సమాచారం ప్రకారం.. హత్య జరిగినప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చిత్రాలను చూపిన సందర్భంలో వీడియోలో ఉన్న వ్యక్తిని నేనేనని, సాక్షిని నేనే చంపానని సాహిల్ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ హత్య పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. పలు రాజకీయ పార్టీలు, నేతలు సాక్షి ఇంటికి క్యూ కట్టారు. సాక్షి తల్లిదండ్రులు నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు ఎందుకు హత్య చేశాడనే విషయం తమకు తెలియదని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..