Delhi Murder Case: సాక్షి హత్య కేసులో సాహిల్ పట్టించిన ఫోన్ కాల్.. నేరం ఒప్పుకున్న నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Murder Case: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక సాక్షి హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాహిల్ అనే 20 ఏళ్ల వ్యక్తి అత్యంత క్రూరంగా సాక్షిని 20 కన్నా ఎక్కువ సార్లు పొడిచి, బండరాయితో మోది హత్య చేశారు. ఈ హత్యకు మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. హత్య అనంతంర సాహిల్ అక్కడ నుంచి పారిపోయాడు. కానీ చివరకు ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. సాక్షిని హత్య చేసిన వెంటనే సాహిల్ ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లోని బందువుల ఇంటికి వెళ్లాడు. బస్సులో ప్రయాణించాడు. అయితే స్విచ్చాన్ చేసి తండ్రికి ఫోన్ చేయడంతో పోలీసులు సాహిల్ ఎక్కడున్నాడో గుర్తించి, లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు.
Read Also: Kishan Reddy: ఢిల్లీలోని పురానా ఖిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది..
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
మరోవైపు సాక్షి పోస్టుమార్టం నివేదిక, ఈ హత్య ఎంత క్రూరంగా జరిగిందనే విషయాలను వెల్లడిస్తోంది. పుర్రె భాగం మొత్తం పగిలిపోయినట్లు తేలింది. బండరాయితో మోదడంతో పుర్రె పూర్తిగా ఛిద్రమైంది. సాక్షితో సాహిల్ కు మూడేళ్లుగా పరిచయం ఉందని, అయితే ఇటీవల సాహిల్ ను దూరం పెట్టడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతడు, బాలికను దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు సాహిల్ కు హుక్కా, మద్యపానం అలవాటు ఉన్నట్లు అతని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా గుర్తించారు.
ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం జరిగిన విచారణలో నిందితుడు సాహిల్, 16 ఏళ్ల సాక్షిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీస్ వర్గాలు తెలిపాయి. సమాచారం ప్రకారం.. హత్య జరిగినప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చిత్రాలను చూపిన సందర్భంలో వీడియోలో ఉన్న వ్యక్తిని నేనేనని, సాక్షిని నేనే చంపానని సాహిల్ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ హత్య పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. పలు రాజకీయ పార్టీలు, నేతలు సాక్షి ఇంటికి క్యూ కట్టారు. సాక్షి తల్లిదండ్రులు నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు ఎందుకు హత్య చేశాడనే విషయం తమకు తెలియదని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..