Delhi Murder Case: సాక్షి హత్య కేసులో సాహిల్ పట్టించిన ఫోన్ కాల్.. నేరం ఒప్పుకున్న నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Murder Case: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక సాక్షి హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాహిల్ అనే 20 ఏళ్ల వ్యక్తి అత్యంత క్రూరంగా సాక్షిని 20 కన్నా ఎక్కువ సార్లు పొడిచి, బండరాయితో మోది హత్య చేశారు. ఈ హత్యకు మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. హత్య అనంతంర సాహిల్ అక్కడ నుంచి పారిపోయాడు. కానీ చివరకు ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. సాక్షిని హత్య చేసిన వెంటనే సాహిల్ ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లోని బందువుల ఇంటికి వెళ్లాడు. బస్సులో ప్రయాణించాడు. అయితే స్విచ్చాన్ చేసి తండ్రికి ఫోన్ చేయడంతో పోలీసులు సాహిల్ ఎక్కడున్నాడో గుర్తించి, లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు.
Read Also: Kishan Reddy: ఢిల్లీలోని పురానా ఖిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది..
Also Read
- Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
- Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
మరోవైపు సాక్షి పోస్టుమార్టం నివేదిక, ఈ హత్య ఎంత క్రూరంగా జరిగిందనే విషయాలను వెల్లడిస్తోంది. పుర్రె భాగం మొత్తం పగిలిపోయినట్లు తేలింది. బండరాయితో మోదడంతో పుర్రె పూర్తిగా ఛిద్రమైంది. సాక్షితో సాహిల్ కు మూడేళ్లుగా పరిచయం ఉందని, అయితే ఇటీవల సాహిల్ ను దూరం పెట్టడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతడు, బాలికను దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు సాహిల్ కు హుక్కా, మద్యపానం అలవాటు ఉన్నట్లు అతని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా గుర్తించారు.
ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం జరిగిన విచారణలో నిందితుడు సాహిల్, 16 ఏళ్ల సాక్షిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీస్ వర్గాలు తెలిపాయి. సమాచారం ప్రకారం.. హత్య జరిగినప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చిత్రాలను చూపిన సందర్భంలో వీడియోలో ఉన్న వ్యక్తిని నేనేనని, సాక్షిని నేనే చంపానని సాహిల్ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ హత్య పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. పలు రాజకీయ పార్టీలు, నేతలు సాక్షి ఇంటికి క్యూ కట్టారు. సాక్షి తల్లిదండ్రులు నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు ఎందుకు హత్య చేశాడనే విషయం తమకు తెలియదని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!