Akhilesh Yadav: మోడీ, యోగిల మధ్య ఆధిపత్య పోరు.. సంభాల్ మసీదు వివాదంపై అఖిలేష్..
- సంభాల్ హింసపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..
- మోడీ-యోగి ఆధిపత్య పోరుగా ఆరోపణ..
- దేశంలో సోదరభావాన్ని బీజేపీ పాడు చేస్తుందని విమర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ ఇటీవల తీవ్ర హింస చెలరేగింది. నగరంలోని షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులపై అక్కడి గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. వేల మంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. స్థానిక సమాజ్వాదీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉంటే, మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో సమాజ్వాదీ ఎంపీ అఖిలేష్ యాదవ్ సంభాల్ హింసని లేవనెత్తారు. ఈ హింస బీజేపీ పన్నిన కుట్రగా ఆరోపించారు. ఐదుగురు మరణాలకు పోలీసులు, ఇతర అధికారులు బాధ్యులని, వారిపై హత్యానేరం మోపాలని డిమాండ్ చేశారు. ‘‘సంభాల్లో జరిగిన ఘటన పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర.. ఉత్తరప్రదేశ్లో నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నవంబర్ 20కి వాయిదా పడింది.. పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలి. ఇది ఢిల్లీ, లక్నోల మధ్య జరుగుతున్న పోరాటం’’ అని వ్యాఖ్యానించారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Read Also: S Jaishankar: భారత్-చైనా సంబంధాలపై పార్లమెంట్లో EAM ప్రకటన..
ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య ఆధిపత్య పోరు నెలకొందని సంచలన ఆరోపణలు చేశారు. లక్నో, ఢిల్లీ మధ్య ఆధిపత్య పోరు నెలకొందని అన్నారు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎన్డీయే నేతలు తీవ్రంగా ఖండించారు. నిరసన వ్యక్తం చేశారు. దీంతో లోక్సభ వాయిదా పడింది.
మొఘల్ కాలంలోని జామా మసీదు, ప్రాచీన హిందూ ఆలయం హరిహర్ మందిరంపై నిర్మించారని, బాబర్ కాలంలో ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్లు హిందూ పక్షం స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, కోర్టు మసీదు సర్వేకి ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సర్వేకి వెళ్లిన అధికారులపై ఓ ముస్లిం వర్గం దాడికి పాల్పడింది. దీంతో హింస చెలరేగింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు దేశంలో సోదరభావాన్ని నాశనం చేస్తున్నాయంటూ అఖిలేష్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?