Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
- ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
- ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
- అధిక ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి గందరగోళం ఎందుకు తలెత్తిందంటూ తీవ్రంగా మందలించింది. ఇక ఇండిగో సంక్షోభం సమయంలో ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఎలా అనుమతించబడ్డాయని న్యాయస్థానం నిలదీసింది. అసలెందుకు ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రాన్ని అడిగింది.
ఇది కూడా చదవండి: JD vance-Usha: రెస్టారెంట్లో జేడీవాన్స్-ఉషా వాన్స్ ఘర్షణ.. ఫొటో వైరల్!
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
వందలాది విమానాలు ఒకేసారి ఎందుకు క్యాన్సిల్ అయ్యాయని కేంద్రాన్ని మందలించింది. ఇక విమాన ఛార్జీలు రూ.40,000 పెంచకుండా నిరోధించడంలో విఫలమైనట్లుగా తప్పుపట్టింది. సంక్షోభ సమయంలో ఇతర విమాన సంస్థలు ఎందుకు ధరలు పెంచేశాయని ధర్మాసనం అడిగింది. కేంద్రం తీసుకున్న చర్యల జాబితాను అదనపు సొలిసిటర్ జనరల్ చదివి వినిపించారు. అయితే ఈ సంక్షోభం ఎందుకు తలెత్తిందంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. పైలట్లు ఎందుకు ఎక్కువ పనిభారంతో బాధపడుతున్నారో.. దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: Gujarat: ఓ అమ్మాయిపై ఇద్దరి స్నేహితులు మక్కువ.. చివరికేమైందంటే..!
‘‘మీ ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాము. ప్రశ్న ఏమిటంటే.. అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది విమానాశ్రయాల్లో వ్యక్తిగత ప్రయాణీకులు చిక్కుకుపోవడం మాత్రమే కాదు. ఈ ప్రశ్న ఆర్థిక వ్యవస్థకు నష్టం. ఇది ప్రయాణీకులకు వేధింపులు. ప్రయాణీకులకు పరిహారం చెల్లించడానికి ఏ చర్యలు తీసుకున్నారు? సర్వీస్ ప్రొవైడర్ల ఉద్యోగులు బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చూసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నారు?.’’ అని కేంద్రాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.
గత వారం నుంచి దేశంలో ఇండిగో సంక్షోభం తలెత్తింది. వందిలాది విమానాలు రద్దు అవ్వడంతో దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో గందరగోళం నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు తిండి తిప్పలు మానేసి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాశారు. ఇక లగేజీలతో ఎయిర్పోర్టులు డంప్ యార్డులుగా మారాయి. ఇక హఠాత్తుగా ప్రయాణాలు ఆగిపోవడంతో ప్రయాణికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!