Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
- ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
- ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
- అధిక ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీత
దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి గందరగోళం ఎందుకు తలెత్తిందంటూ తీవ్రంగా మందలించింది. ఇక ఇండిగో సంక్షోభం సమయంలో ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఎలా అనుమతించబడ్డాయని న్యాయస్థానం నిలదీసింది. అసలెందుకు ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రాన్ని అడిగింది.
ఇది కూడా చదవండి: JD vance-Usha: రెస్టారెంట్లో జేడీవాన్స్-ఉషా వాన్స్ ఘర్షణ.. ఫొటో వైరల్!
Also Read
వందలాది విమానాలు ఒకేసారి ఎందుకు క్యాన్సిల్ అయ్యాయని కేంద్రాన్ని మందలించింది. ఇక విమాన ఛార్జీలు రూ.40,000 పెంచకుండా నిరోధించడంలో విఫలమైనట్లుగా తప్పుపట్టింది. సంక్షోభ సమయంలో ఇతర విమాన సంస్థలు ఎందుకు ధరలు పెంచేశాయని ధర్మాసనం అడిగింది. కేంద్రం తీసుకున్న చర్యల జాబితాను అదనపు సొలిసిటర్ జనరల్ చదివి వినిపించారు. అయితే ఈ సంక్షోభం ఎందుకు తలెత్తిందంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. పైలట్లు ఎందుకు ఎక్కువ పనిభారంతో బాధపడుతున్నారో.. దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: Gujarat: ఓ అమ్మాయిపై ఇద్దరి స్నేహితులు మక్కువ.. చివరికేమైందంటే..!
‘‘మీ ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాము. ప్రశ్న ఏమిటంటే.. అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది విమానాశ్రయాల్లో వ్యక్తిగత ప్రయాణీకులు చిక్కుకుపోవడం మాత్రమే కాదు. ఈ ప్రశ్న ఆర్థిక వ్యవస్థకు నష్టం. ఇది ప్రయాణీకులకు వేధింపులు. ప్రయాణీకులకు పరిహారం చెల్లించడానికి ఏ చర్యలు తీసుకున్నారు? సర్వీస్ ప్రొవైడర్ల ఉద్యోగులు బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చూసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నారు?.’’ అని కేంద్రాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.
గత వారం నుంచి దేశంలో ఇండిగో సంక్షోభం తలెత్తింది. వందిలాది విమానాలు రద్దు అవ్వడంతో దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో గందరగోళం నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు తిండి తిప్పలు మానేసి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాశారు. ఇక లగేజీలతో ఎయిర్పోర్టులు డంప్ యార్డులుగా మారాయి. ఇక హఠాత్తుగా ప్రయాణాలు ఆగిపోవడంతో ప్రయాణికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో