Delhi Election Results: ఆప్ చేసిన తప్పు ఇదేనా? అలా చేసుంటే గెలిచేదా?
- ఆప్ చేసిన తప్పు ఇదేనా?
- అలా చేసుంటే గెలిచేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. అయితే ఆప్ ఓటమికి స్వయంకృత అపరాధమే కారణమని తెలుస్తోంది. ఇండియా కూటమిలో ఒక్కటిగా ఉన్న ఆప్, కాంగ్రెస్.. విడివిడిగా పోటీ చేయడమే ప్రధాన లోపంగా కనిపిస్తోంది. కేవలం స్వల్ప ఓట్ల తేడాతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి కొంత మంది ముఖ్యమైన నేతలు ఓడిపోయారు. ఆ స్థానాల్లో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లతో ఈజీగా ఆప్ అభ్యర్థులు గట్టెక్కేవారు. కానీ వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయాయి. దీంతో బీజేపీ అభ్యర్థులు ఈజీగా గట్టెక్కేశారు. మేజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తిగా మారారు.
న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన కేజ్రీవాల్ స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేసుంటే.. ఈజీగా కేజ్రీవాల్ గెలిచేవారు. కాంగ్రెస్ పోటీ చేయకుంటే.. ఆ ఓట్లన్నీ కేజ్రీవాల్కు పడి సునాయసంగా గెలుపొందేవారు. విడివిడిగా పోటీ చేయడం వల్ల కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో 4,089 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్కు 4,568 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే.. దీక్షిత్కు పడ్డ ఓట్లన్నీ కేజ్రీవాల్కు పడి ఉంటే ఆప్ అధినేత గెలిచేవారు. విడిగా పోటీ చేయడం వల్ల ఘోరంగా దెబ్బతిన్నారు.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
ఇండియా కూటమిలో ఉన్న ఆప్-కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసి ప్రత్యర్థుల మాదిరి ఆరోపణలు చేసుకున్నారు. బీజేపీ చేసినట్టుగానే.. కాంగ్రెస్ కూడా ఆప్పై ఆరోపణలు చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. విడిగా పోటీ చేయడం వల్ల ఇద్దరూ ప్రయోజనం పొందకుండా పోయారు. గతంలో ఆప్ కూడా భారీ విజయాలు నమోదు చేయడంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఒంటరిగా బరిలోకి దిగడంతో అంచనాలు తల్లకిందులయ్యాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ సర్కార్ను ఏర్పాటు చేయనుంది. ఇక ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఓటమిని కేజ్రీవాల్ స్వాగతించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు.
తాజావార్తలు
-
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!