Nitin Gadkari: ఢిల్లీలో మూడ్రోజులు ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది..
- ఢిల్లీ కాలుష్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ..
- కాలుష్యం ఇలాగే కొనసాగితే ఢిల్లీ ప్రజల ఆయుర్దాయం దాదాపు 10 ఏళ్లు తగ్గుతుంది..
- ఢిల్లీలో మూడ్రోజులు ఉంటే జబ్బు రావడం ఖాయం: కేంద్రమంత్రి గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హస్తినలో మూడు రోజులుంటే చాలు వ్యాధి రావడం ఖాయమన్నారు. కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై రెడ్జోన్లో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజల ఆయుర్దాయం దాదాపు 10 ఏళ్లు తగ్గుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాల్సి ఉందని ఆయన సూచించారు. అలాగే, రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తున్నామో.. పర్యావరణాన్ని కూడా అలాగే, రక్షిస్తామన్నారు. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి రహదారుల మౌలిక సదుపాయాల కల్పన కూడా ఓ పరిష్కారంగా పని చేస్తుందని నితీన్ గడ్కరీ వెల్లడించారు.
Read Also: Calcutta: హైకోర్టు సంచలన తీర్పు.. వివాహితులిద్దరూ శారీరిక సంబంధం పెట్టుకోవడం నేరం కాదు
Also Read
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
అయితే, పెట్రోల్, డీజిల్ కాలుష్యానికి ప్రధాన కారణాలు కాబట్టి వాహనాల్లో ఉపయోగించే ఇంధనంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. మనం దాదాపు రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నాం.. వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే లక్ష్యంతో వెళ్తున్నాం.. భారత్ రవాణా, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ రంగాలలో ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేకంగా నజర్ పెట్టిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల లాజిస్టిక్ ఖర్చులు 12 శాతం లోపు ఉంటే.. మన ఖర్చులు 16 శాతంగా ఉన్నాయి.. 2026 చివరి నాటికి వాటిని సింగిల్ డిజిట్కు తగ్గించడానికి ప్రయత్నిస్తామని నితీన్ గడ్కరీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
-
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
-
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?