Atishi: సీఎం బంగ్లా మరోసారి రద్దు.. ప్రజల ఇళ్లల్లోనే ఉంటానన్న అతిషి
- సీఎం బంగ్లా మరోసారి రద్దు
- సోమవారం నోటీసు వచ్చిందన్న అతిషి
- ప్రజల ఇళ్లల్లోనే ఉంటానన్న సీఎం అతిషి
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో హస్తినలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. అయితే ఢిల్లీలో షెడ్యూల్కు ముందు నుంచే ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ప్రధాన పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.
ఇది కూడా చదవండి: Daaku Maharaaj: తెలంగాణలో టికెట్ రేట్ల హైక్ పై నాగ వంశీ కీలక ప్రకటన..
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
- IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి అతిషి.. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు కేటాయించిన బంగ్లాను మరోసారి కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు. మూడు నెలల కాలంలో ఇది రెండోసారని చెప్పారు. మంగళవారం అతిషి మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లా ఖాళీ చేయాలంటూ సోమవారం నోటీసులు వచ్చాయని తెలిపారు. బంగ్లా ఖాళీ చేయాలంటూ నోటీసులు పేర్కొన్నారని చెప్పారు. ఇక తన కుటుంబ సభ్యుల్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని.. తాను సీఎంగా ఎన్నికైన తర్వాత.. తన వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు బయటకు విసిరేశారని తెలిపారు. ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయకుండా.. మా ఇండ్లు గుంజుకుంటున్నారని ఆరోపించారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లల్లో ఉండి వాళ్ల కోసం పని చేస్తానని అతిషి చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Borewell Incident: బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి మృతి.. 34 గంటల రెస్య్కూ విఫలం..
మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 శాసనసభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.08 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఇక 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
ఇదిలా ఉంటే అధికార పార్టీ ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. బీజేపీ తొలి విడతగా 29 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక్కడ ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
#WATCH | Delhi CM Atishi says, "Today the dates for the upcoming assembly elections have been announced…The BJP-led central government has thrown me out of the Chief Minister's residence for the second time in three months…The BJP thinks that they will stop us from working by… pic.twitter.com/nmLrJrZI2h
— ANI (@ANI) January 7, 2025
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
Hardik Pandya: హార్దిక్ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!
-
Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!