Borewell Incident: బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి మృతి.. 34 గంటల రెస్య్కూ విఫలం..
- గుజరాత్ బోరుబావి ఘటన విషాదం..
- బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి మృతి..
- 34 గంటల రెస్క్యూ తర్వాత బయటకు మృతదేహం..
- ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Borewell Incident: రోజుల వ్యవధిలో రెండు బోరుబావి సంఘటనలు విషాదంగా మారాయి. ఇటీవల రాజస్థాన్లో చేతన అనే 3 ఏళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. 10 రోజుల రెస్క్యూ తర్వాత విగతజీవిగా బయటకు తీసుకువచ్చారు. తాజాగా, గుజరాత్ కచ్లో బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి ఇంద్రా మీనా ఘటన కూడా విషాదంగా మారింది. 33 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత యువతి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీల ప్రయత్నం వృథాగా మారింది.
Read Also: Amit Banerji: విషాదం.. టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
కచ్ జిల్లా భుజ్ తాలూకాలోని కండేరాయ్ గ్రామంలో సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 540 అడుగుల లోతున్న బావిలో యువతి పడిపోయింది. 490 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. గంటల తరబడి బోరుబావిలో చిక్కుకుపోవడం వల్ల ఇంద్రా మీనాకు గాయాలతో ప్రాణాలు విడిచింది. సుదీర్ఘంగా బోరుబావిలో ఉండటం వల్ల ఆమె శరీరం ఉబ్బి, బయటకు తీయడం కష్టంగా మారింది.
ఆమె మరణానికి బోరుబావిలో పడటం కారణమా లేక, ఇందులో ఏదైనా కుట్ర ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం తర్వాత అసలు కారణాలు తెలియనున్నాయి. మరణించిన యువతి రాజస్థాన్కి చెందిన వలసకూలీ కుటుంబానికి చెందినది. ఇంతపెద్ద వయసు ఉన్న యువతి బోరుబావిలో పడిందన వార్తపై ముందుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం కెమెరా సాయంతో ఆమె బోరుబావిలో ఉన్నట్లు నిర్ధారించి, రెస్క్యూ కార్యక్రమాలు మొదలుపెట్టారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!