CPI Narayana: టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తీరుపై మండిపడ్డారు. ‘భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన ఎప్పుడూ జరగలేదు. వారు చేసిన తప్పేంటి? అని ప్రశ్నించారు. పార్లమెంట్ పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారు. ఒకవేళ ఏదైనా జరిగితే సభ్యులు చనిపోయేవారు కదా? బీజేపీ ఎంపీ పాస్ ఇవ్వడం నిజమా కాదా? పొరపాటున ఏ MIM ఎంపీ ఇచ్చి ఉంటే ఏం చేసేవారు? పార్లమెంట్ నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారు? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అని నా అనుమానం.
Also Read: USA: హిందూ ఆలయంపై దాడి.. ఖలిస్తానీ అనుకూల నినాదాలు..
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
ఎన్నికల్లో లబ్ధి కోసం చేసిన నాటకీయ ప్రక్రియ అనిపిస్తోంది. లేదంటే ఎంత సీరియస్ గా వ్యవహరించాలి? అటువంటిదేమీ కనిపించడం లేదే? ఎన్నికల గిమ్మిక్ లో భాగంగానే ప్రమాదకర గేమ్ అడారు. ఇండియా కూటమికి దేశంలో జనాదరణ పెరుగుతుంది కాబట్టి ఇలా చేస్తున్నారు. రామజన్మభూమి ఆలయానికి వ్యూహాత్మకంగా అందరినీ పిలిచారు. బాబ్రీ మసీదు కూలగొట్టడానికి ఆద్యుడు ఎల్కే అద్వానీ. కానీ ఆయన్ను రానివ్వడం లేదు. ఆయనొస్తే పేరు ఆయనకే వెళ్తుంది. అది మోడీకి ఇష్టం లేదు. అందుకే అద్వానీ, మురళీ మనోహర్ జోషికి ఆహ్వానం లేదు. ఉపరాష్ట్రపతిని మిమిక్రీ చేశామని గోల చేస్తున్నారు. అది ఒక కళ. ఇండియా కూటమి పొత్తులు తెలంగాణలో విజయం సాధించాయి.
ఏపీలో పార్టీలు అన్నీ కేంద్ర హోంమంత్రిని, బీజేపీని చూసి భయపడుతున్నాయి. మోడీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు సృష్టిస్తారో అని వారంతా భయపడుతున్నారు. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే మా పొత్తులు ఉంటాయి. బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి. ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపే. వారితో అంటకాగే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరు. జగన్ కి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్ళాలి అన్నది మా ఉద్దేశం. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం. పోల్ మేనేజ్మెంట్కు భయపడే వారు బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతున్నారు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!