Hijab ban row: ఇండియా కూటమికి అధికారం ఇస్తే దేశంలో ఇస్లామిక్ చట్టం తెస్తారు.. హిజాబ్ వివాదంపై బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijab ban row: కర్ణాటకలో మరోసారి హిజాబ్ వివాదం రాజుకుంది. బీజేపీ హయాంలో పాఠశాలల్లో విద్యార్థులంతా ఒకే దుస్తులు ధరించాలని, హిబాబ్పై బ్యాన్ విధించింది. దీనిపై కర్ణాటక హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయగా.. కోర్టు కూడా హిజాబ్ అనేది ముస్లిం ఆచారాల్లో తప్పనిసరి ఆచారం కాదని, విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, హిజాబ్ బ్యాన్ని ఎత్తేసింది.
సీఎం సిద్ధరామయ్య రాష్ట్రంలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తేయడం వల్ల రాష్ట్రంలో షరియా చట్టం ఏర్పడుతుందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే దేశవ్యాప్తంగా ఇస్లామిక్ చట్టం అమలులోకి వస్తుందని ఆరోపించారు. ‘‘ఇది కేవలం హిజాబ్పై నిషేధాన్ని ఎత్తేవేయడమే కాదు, రాష్ట్రంలో షరియా చట్టాన్ని ఏర్పాటు చేయడం, రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ఇండియా కూటమి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తుంది. సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారు’’ అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Dunki Day 2 Collections : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ కలెక్షన్స్ డౌన్.. సలార్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందిగా..
సిద్ధరామయ్య ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, 2024 లోక్సభ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను పొందాలని భావిస్తున్నారని మాజీ సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టించేందుకు సిద్ధరామయ్య ఇలా చేస్తు్న్నారని ఆరోపించారు. ముస్లింలను సంతృప్తిపరిచేందుకు హిజాబ్పై సిద్ధరామయ్య నిషేధాన్ని ఎత్తేశారని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప ఆరోపించారు.
అయితే ఈ చర్య చట్టబద్ధంగా జరుగుతోందని, ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని కాంగ్రెస్, బీజేపీ ఆరోపణల్ని తిప్పికొట్టింది. బీజేపీకి రాజ్యాంగంపై అవగాహన లేదని రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఈ అంశంపై సీఎంతో చర్చించి ముందుకు వెళ్తామని రాష్ట్రమంత్రి మధు బంగారప్ప అన్నారు. మరో మంత్రి హెచ్కే పాటిల్ మాట్లాడుతూ.. సెక్యులర్గా ఉండటం బుజ్జగించడమేనా..? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!