Covid-19: మరోసారి కరోనా విజృంభణ.. ఢిల్లీలో తాజాగా ఇద్దరు మృతి
- మరోసారి దేశంలో కరోనా విజృంభణ
- ఢిల్లీలో 3కి చేరిన మృతులు
- ప్రస్తుతం దేశంలో 2,700 యాక్టివ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మరోసారి కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. నిన్నామొన్నటి దాకా స్తబ్ధతగా ఉన్న కోవిడ్ తాజాగా మళ్లీ పడగ విప్పుతోంది. అనేక రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 22 మంది చనిపోగా.. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ మృతుల సంఖ్య 3కి చేరింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 2, 700 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో తీవ్ర నష్టం జరగడంతో వైద్య శాఖ అప్రమత్తమై.. జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Kamal: నాకన్నా నలుగురు బెస్ట్ యాక్టర్స్ దొరికినపుడు నటన ఆపేస్తా!
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
గత వారం నుంచి ఒక్కసారిగా అమాంతంగా వెయ్యి కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం కేరళలో 1,147 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 424 కేసులు, ఢిల్లీలో 294 కేసులు, గుజరాత్లో 223 కేసులు, కర్ణాటక, తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు నమోదయ్యాయి. కేరళలోనే ఎక్కువు ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా డేటాలో పేర్కొంది. ఇప్పటిదాకా ప్రశాంతంగా కరోనా.. మే 25 నుంచి బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని తెలిపింది. వారంలోనే 5 రెట్లు పెరిగిపోయాయని చెప్పింది.
ఇది కూడా చదవండి: Gulzar House Incident: గుల్జార్ హౌస్ బాధితుల ఆరోపణలపై స్పందించిన అగ్నిమాపక శాఖ
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏడు మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 22 మంది చనిపోయినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో రెండు మరణాలు సంభవించగా.. గుజరాత్, కర్ణాటక, పంజాబ్ మరియు తమిళనాడులో ఒక్కొక్కటి చొప్పున మరణాలు సంభవించాయి. ఇక ఢిల్లీలో తాజాగా కోవిడ్తో ఇద్దరు చనిపోయారు. జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన సంఖ్య ఢిల్లీలో 3కు చేరింది. పేగు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న 60 ఏళ్ల మహిళ, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న 71 ఏళ్ల వృద్ధుడు ఢిల్లీలో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే కోవిడ్ ప్రభావం తక్కువగానే ఉందని.. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళలో ఎక్కువగా పరీక్షలు నిర్వహించడం వల్లే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలతో సమానంగా ఉన్నాయని.. కొన్ని లక్షణాల్లో జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట ఉన్నాయని చెప్పింది. ఇక కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఆసుపత్రులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, పరీక్షా కిట్లు మరియు వ్యాక్సిన్ల లభ్యతను కొనసాగించాలని ఆదేశించింది. వృద్ధులు, ఇతర వ్యాధులు ఉన్నవారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్క్లు ధరించాలని సూచించింది.
తాజావార్తలు
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
-
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
-
US LPG Supplier to India: భారత్కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!