Covid-19: మరోసారి కరోనా విజృంభణ.. ఢిల్లీలో తాజాగా ఇద్దరు మృతి
- మరోసారి దేశంలో కరోనా విజృంభణ
- ఢిల్లీలో 3కి చేరిన మృతులు
- ప్రస్తుతం దేశంలో 2,700 యాక్టివ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మరోసారి కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. నిన్నామొన్నటి దాకా స్తబ్ధతగా ఉన్న కోవిడ్ తాజాగా మళ్లీ పడగ విప్పుతోంది. అనేక రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 22 మంది చనిపోగా.. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ మృతుల సంఖ్య 3కి చేరింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 2, 700 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో తీవ్ర నష్టం జరగడంతో వైద్య శాఖ అప్రమత్తమై.. జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Kamal: నాకన్నా నలుగురు బెస్ట్ యాక్టర్స్ దొరికినపుడు నటన ఆపేస్తా!
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
గత వారం నుంచి ఒక్కసారిగా అమాంతంగా వెయ్యి కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం కేరళలో 1,147 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 424 కేసులు, ఢిల్లీలో 294 కేసులు, గుజరాత్లో 223 కేసులు, కర్ణాటక, తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు నమోదయ్యాయి. కేరళలోనే ఎక్కువు ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా డేటాలో పేర్కొంది. ఇప్పటిదాకా ప్రశాంతంగా కరోనా.. మే 25 నుంచి బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని తెలిపింది. వారంలోనే 5 రెట్లు పెరిగిపోయాయని చెప్పింది.
ఇది కూడా చదవండి: Gulzar House Incident: గుల్జార్ హౌస్ బాధితుల ఆరోపణలపై స్పందించిన అగ్నిమాపక శాఖ
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏడు మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 22 మంది చనిపోయినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో రెండు మరణాలు సంభవించగా.. గుజరాత్, కర్ణాటక, పంజాబ్ మరియు తమిళనాడులో ఒక్కొక్కటి చొప్పున మరణాలు సంభవించాయి. ఇక ఢిల్లీలో తాజాగా కోవిడ్తో ఇద్దరు చనిపోయారు. జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన సంఖ్య ఢిల్లీలో 3కు చేరింది. పేగు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న 60 ఏళ్ల మహిళ, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న 71 ఏళ్ల వృద్ధుడు ఢిల్లీలో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే కోవిడ్ ప్రభావం తక్కువగానే ఉందని.. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళలో ఎక్కువగా పరీక్షలు నిర్వహించడం వల్లే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలతో సమానంగా ఉన్నాయని.. కొన్ని లక్షణాల్లో జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట ఉన్నాయని చెప్పింది. ఇక కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఆసుపత్రులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, పరీక్షా కిట్లు మరియు వ్యాక్సిన్ల లభ్యతను కొనసాగించాలని ఆదేశించింది. వృద్ధులు, ఇతర వ్యాధులు ఉన్నవారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్క్లు ధరించాలని సూచించింది.
తాజావార్తలు
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!