Covid-19 Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..! ఆ రాష్ట్రంలోనే ఎక్కువ రోగులు..
- దేశవ్యాప్తంగా 4,026 దాటిన యాక్టివ్ కరోనా కేసులు..
- కేరళలో అత్యధికంగా 1,416 యాక్టివ్ కేసులు నమోదు..
- ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వ్యాప్తికి కారణమని ఐసీఎంఆర్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19 Cases: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవాళ (మంగళవారం) ఉదయం వరకు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో ఐదుగురు కరోనా సోకి చనిపోయారు. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా బారిన పడిన రాష్ట్రాలలో కేరళ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: Telangana Jagruthi : ఇందిరా పార్క్ వద్ద రేపు తెలంగాణ జాగృతి మహాధర్నా
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
కాగా, దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో కేరళ మొదటి స్థానంలో కొనసాగుతుండటంతో అధికారులు తగిన చర్యలు చేపట్టారు. మంగళవారం ఒక్కరోజే కేరళలో 171 కొత్త కేసులు నమోదు అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 1,416కి చేరింది. ఇక, ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 393కు చేరగా, మహారాష్ట్రలో 69 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 494కు చేరుకుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా 11 కేసులు నమోదు అవగా.. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 372గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
Read Also: Venkateswara Rao: జగన్పై దాడి కేసు.. పోలీసుల దెబ్బలకు నేటికీ అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు..!
అయితే, ఇండియాలోని దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే కారణమని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ ధృవీకరించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఈ సబ్ వేరియంట్లు తీవ్రమైనవి కాదని స్పష్టం చేశారు. తాజా, పరిస్థితి ప్రజలు గమనిస్తూ, అప్రమత్తంగా ఉండాలి.. కానీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
- Tags
- corona Cases
- Covid 19
- Delhi
- india
- Kerala
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!