Venkateswara Rao: జగన్పై దాడి కేసు.. పోలీసుల దెబ్బలకు నేటికీ అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు..!
- బలహీనుడు కాబట్టి సతీష్ ను బలి చేశారు, 45 రోజులు సతీష్ ను జైలులో పెట్టారు
- ప్రభుత్వం మారాక కూడా తప్పుడు కేసు ను కొట్టివేయకుండా నేటికి తిప్పుతున్నారు
- ఇవాళ్టి వరకు ఆ కేసు లో ఎటువంటి పురోగతి లేదు
- వాళ్లపై ఏ రకమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు వింటే గుండె తరుక్కుపోతుంది
- సతీష్ కుటుంబ బాధితులను పరామర్శించిన రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన కేసులో నిందితుడు సతీష్ కుటుంబ బాధితులను రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు. మనుషుల్ని వాళ్ళ జీవితాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు వైఖరికి సతీష్ పై పెట్టిన కేసు ఒక తార్కాణమని ఎద్దేవా చేశారు. పేద వడ్డెర కులస్తుడైన సతీష్ పై అక్రమ కేసు బనాయించి అతని జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేశారన్నారు. గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బను అప్పటికప్పుడు రాయి దాడిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్నారన్నారు. బలహీనుడు
కాబట్టి సతీష్ ను బలి చేశారని, 45 రోజులు సతీష్ ను జైలులో పెట్టారని చెప్పారు.
READ MORE: IPL History: ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్ను మెయిడెన్ చేసిన అతి భీకర బౌలర్స్ ఎవరో తెలుసా..?
Also Read
ప్రభుత్వం మారాక కూడా తప్పుడు కేసును కొట్టివేయకుండా నేటికి తిప్పుతున్నారని రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇవాళ్టి వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదన్నారు. వాళ్లపై ఏ రకమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు వింటే గుండె తరుక్కుపోతుందన్నారు. సతీష్ తో పాటుగా, దుర్గారావును సైతం ఇబ్బందులు పెట్టారని చెప్పారు. రూ. 2 లక్షలు డబ్బులు ఇస్తామని, టీడీపీ వాళ్ళే దాడి చేయించారని ఒప్పుకో మంటూ మభ్యపెట్టినట్లు ఆరోపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు, నేటికి అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు ఉన్నారన్నారు. ఇంత దుర్మార్గం చేసిన పోలీసులపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇటువంటి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు లో బాధితులను బలి చేసిన బాధ్యులపై ప్రభుత్వం, సీపీ, డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు.
READ MORE: Ambati Rambabu: సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..?
తాజావార్తలు
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..