Congress President Election: ఖర్గే వర్సెస్ థరూర్.. కాంగ్రెస్ అధ్యక్షుడెవరో తేలేది నేడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడెవరో ఈ రోజు తేలనుంది. దాదాపుగా 20 ఏళ్ల తరువాత మొదటిసారిగా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గాంధీయేతర కుటుంబ నుంచి అధ్యక్షుడు రాబోతున్నారు. అక్టోబర్ 17న జరిగిన పోలింగ్ లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. ఇప్పటికే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి దేశంలో పలు రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు చేరాయి. అక్కడకు తరలించిన వాటిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.
దేశవ్యాప్తంగా 38 పోలింగ్ కేంద్రాలు, 68 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కౌంటింగ్ నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు దేశ రాజధానికి వెళుతున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు సీనియర్ నేతలు ఢిల్లీకి రానున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పార్టీ ప్రధాన కార్యాలయం ముందు మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి భారీ పోస్టర్లను ఏర్పాటు చేశారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Sivakarthikeyan: విజయ్తో శివకార్తికేయన్ మల్టీస్టారర్ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
దాదాపుగా 9,900 మంది పార్టీ ప్రతినిధులు ఉంటే 9,477 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. 96 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సగాని కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటించనున్నారు. 4,740 ఓట్లు ఏ అభ్యర్ధికైతే వస్తాయో, ఆ తర్వాత వెనువెంటనే ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కౌంటింగ్ సమయంలో ఒక్కో కట్టలో 25 బ్యాలెట్ పేపర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరో తెలియనుంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి అభ్యర్థుల ఎంపికలో చాలా హైడ్రామా జరిగింది. ముందుగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించాలని మొదట గాంధీ కుటుంబం భావించింది. అయితే ఆయన ససేమిరా అనడంతో చివరి నిమిషంలో మల్లికార్జున ఖర్గే పేరును తీసుకువచ్చారు. శశిథరూర్, ఖర్గేలు ఇద్దరు పోటీ పడ్డారు. అయితే ఖర్గేనే అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పార్టీలోని యువఓటర్లు మాత్రం శశిథరూర్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దళిత కార్డు, కర్ణాటక ఎన్నికల దృష్ట్యా ఖర్గేను తెరపైకి తీసుకువచ్చింది కాంగ్రెస్.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!