Rahul Gandhi: ఎన్డీఏ పాలనతో మహారాష్ట్ర నుంచి 5లక్షల ఉద్యోగాలు తరలిపోయాయి
- రాజ్యాంగాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీనే
- ఎన్డీఏ పాలనతో మహారాష్ట్ర నుంచి 5లక్షల ఉద్యోగాలు తరలిపోయాయి
- మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నందుర్బార్లో జరిగిన బహిరంగ సభలో రాహుల్గాంధీ మాట్లాడారు. రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య పోటీ జరుగుతోందని తెలిపారు. తాను ర్యాలీల్లో ఎరుపు రంగు పుస్తకం ప్రదర్శించడంపై బీజేపీకి అభ్యంతరపడుతుందని విమర్శించారు. కాంగ్రెస్కు రంగుతో సంబంధం లేకుండా రాజ్యాంగాన్ని కాపాడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడడానికి అవసరమైతే ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని తాను చదవలేదని మోడీ భావిస్తుంటారని రాహుల్ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఎన్డీఏ పాలనతో మహారాష్ట్ర నుంచి 5లక్షల ఉద్యోగాలు తరలిపోయాయి
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
దేశాన్ని రాజ్యాంగం ప్రకారం నడపాలని కాంగ్రెస్, ఇండియా కూటమి భావిస్తుందని చెప్పారు. తన చేతిలో రాజ్యాంగం పుస్తకం ఉంటుందని ప్రధాన మోడీ విమర్శిస్తారన్నారు. ఎందుకుంటే మోడీ ఎప్పుడూ రాజ్యాంగం చదవలేదు కాబట్టే విమర్శిస్తుంటారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కుల గణన నిర్వహిస్తామని చెప్పారు. కుల గణన నిర్వహించి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పేర్కొన్నారు. వివిధ పెద్ద ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు తరలించడంతో మహారాష్ట్ర నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు తరలిపోయాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Jagga Reddy: అధికారులపై దాడి చేయించింది బీఆర్ఎస్ నేతలే..!
మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం మూడు రోజుల తర్వాత నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఎన్డీఏ కూటమి నేతలు, ఇండియా కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!