Jagga Reddy: అధికారులపై దాడి చేయించింది బీఆర్ఎస్ నేతలే..!
- అధికారులపై బీఆర్ఎస్ నేతలే దాడులు చేయిస్తున్నారు..
- యూనివర్సిటీల్లోకి వెళ్లి మరీ కొట్టించిన సంగతి మర్చిపోయారా..
- భూములు ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు బెదిరించారు..
- అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు: జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: మంచి పనిని చెడ్డ పనిలా చూపించడంలోనే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ బిజీ ఉన్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మల్లన్న సాగర్లో రైతులను కొట్టి భూములు లాక్కున్నారు.. లగచర్లలో కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులపై దాడి చేసి కంపెనీలను రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చూస్తుంటే కుట్రలు చేస్తున్నారు.. మల్లన్న సాగర్ రైతులను కొట్టిన ఫొటోలు చూపిస్తా.. లగచర్లలో మేము రైతులను కొట్టినట్టు ఆధారాలు చూపించి డిబేట్ కి రండీ అని సవాల్ విసిరారు. మీరే దాడి చేసినట్టు అన్ని ఛానెల్స్ లో వచ్చింది.. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పాలనకు తేడా ప్రజలే గమనించాలని జగ్గారెడ్డి సూచించారు.
Read Also: TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ఇక, కేటీఆర్ కి ఒకడికే రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడ్తున్నారు.. గత 10 ఏండ్లు రాజభోగ్యాల ఆకలి కేటీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులకు తీరలేదు అని జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రైతులను, ప్రజలను కొట్టారు.. ఇప్పుడు మా ప్రభుత్వంలోను ప్రజలకు దెబ్బలే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు.. ప్రజలను రెచ్చగొట్టి దాడులకు కుట్ర చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అలాగే, గతంలో యూనివర్సిటీల్లోకి వెళ్లి మరీ కొట్టించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. భూములు ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు బెదిరించారు.. అధికారం పోయిందనే అక్కసుతో ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు ధర్నా చౌక్ లేకుండా ఎత్తేశారని మండిపడ్డారు. ఇక, రైతులకు తమ ప్రభుత్వం రుణ మాఫీ చేసిన చేయలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!