Jagga Reddy: అధికారులపై దాడి చేయించింది బీఆర్ఎస్ నేతలే..!
- అధికారులపై బీఆర్ఎస్ నేతలే దాడులు చేయిస్తున్నారు..
- యూనివర్సిటీల్లోకి వెళ్లి మరీ కొట్టించిన సంగతి మర్చిపోయారా..
- భూములు ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు బెదిరించారు..
- అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు: జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: మంచి పనిని చెడ్డ పనిలా చూపించడంలోనే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ బిజీ ఉన్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మల్లన్న సాగర్లో రైతులను కొట్టి భూములు లాక్కున్నారు.. లగచర్లలో కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులపై దాడి చేసి కంపెనీలను రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చూస్తుంటే కుట్రలు చేస్తున్నారు.. మల్లన్న సాగర్ రైతులను కొట్టిన ఫొటోలు చూపిస్తా.. లగచర్లలో మేము రైతులను కొట్టినట్టు ఆధారాలు చూపించి డిబేట్ కి రండీ అని సవాల్ విసిరారు. మీరే దాడి చేసినట్టు అన్ని ఛానెల్స్ లో వచ్చింది.. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పాలనకు తేడా ప్రజలే గమనించాలని జగ్గారెడ్డి సూచించారు.
Read Also: TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ఇక, కేటీఆర్ కి ఒకడికే రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడ్తున్నారు.. గత 10 ఏండ్లు రాజభోగ్యాల ఆకలి కేటీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులకు తీరలేదు అని జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రైతులను, ప్రజలను కొట్టారు.. ఇప్పుడు మా ప్రభుత్వంలోను ప్రజలకు దెబ్బలే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు.. ప్రజలను రెచ్చగొట్టి దాడులకు కుట్ర చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అలాగే, గతంలో యూనివర్సిటీల్లోకి వెళ్లి మరీ కొట్టించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. భూములు ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు బెదిరించారు.. అధికారం పోయిందనే అక్కసుతో ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు ధర్నా చౌక్ లేకుండా ఎత్తేశారని మండిపడ్డారు. ఇక, రైతులకు తమ ప్రభుత్వం రుణ మాఫీ చేసిన చేయలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PM Modi-Putin Talks: మోడీ-పుతిన్ భేటీ నేడు.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!