Jagga Reddy: అధికారులపై దాడి చేయించింది బీఆర్ఎస్ నేతలే..!
- అధికారులపై బీఆర్ఎస్ నేతలే దాడులు చేయిస్తున్నారు..
- యూనివర్సిటీల్లోకి వెళ్లి మరీ కొట్టించిన సంగతి మర్చిపోయారా..
- భూములు ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు బెదిరించారు..
- అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు: జగ్గారెడ్డి
Jagga Reddy: మంచి పనిని చెడ్డ పనిలా చూపించడంలోనే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ బిజీ ఉన్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మల్లన్న సాగర్లో రైతులను కొట్టి భూములు లాక్కున్నారు.. లగచర్లలో కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులపై దాడి చేసి కంపెనీలను రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చూస్తుంటే కుట్రలు చేస్తున్నారు.. మల్లన్న సాగర్ రైతులను కొట్టిన ఫొటోలు చూపిస్తా.. లగచర్లలో మేము రైతులను కొట్టినట్టు ఆధారాలు చూపించి డిబేట్ కి రండీ అని సవాల్ విసిరారు. మీరే దాడి చేసినట్టు అన్ని ఛానెల్స్ లో వచ్చింది.. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పాలనకు తేడా ప్రజలే గమనించాలని జగ్గారెడ్డి సూచించారు.
Read Also: TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు
Also Read
- TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
- Telangana Fuel Supply : తెలంగాణలో ఇంధన సంక్షోభానికి సర్కార్ చెక్
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ఇక, కేటీఆర్ కి ఒకడికే రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడ్తున్నారు.. గత 10 ఏండ్లు రాజభోగ్యాల ఆకలి కేటీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులకు తీరలేదు అని జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రైతులను, ప్రజలను కొట్టారు.. ఇప్పుడు మా ప్రభుత్వంలోను ప్రజలకు దెబ్బలే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు.. ప్రజలను రెచ్చగొట్టి దాడులకు కుట్ర చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అలాగే, గతంలో యూనివర్సిటీల్లోకి వెళ్లి మరీ కొట్టించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. భూములు ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు బెదిరించారు.. అధికారం పోయిందనే అక్కసుతో ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు ధర్నా చౌక్ లేకుండా ఎత్తేశారని మండిపడ్డారు. ఇక, రైతులకు తమ ప్రభుత్వం రుణ మాఫీ చేసిన చేయలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!