Congress: అమిత్ షాపై కాంగ్రెస్ ‘‘సభా హక్కుల ఉల్లంఘన నోటీసు’’..
- అమిత్ షాపై కాంగ్రెస్ సభా హక్కుల తీర్మానం..
- సోనియా గాంధీపై వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ‘‘నిందించే వ్యాఖ్యలు’’ చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆ పార్టీ బుధవారం ‘‘సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం’’ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ నోటీసుల్ని సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో అమిత్ షా సోనియాగాంధీపై ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు చేసి ఆమె ప్రతిష్టను దిగజార్చాలని చూశారని జైరాంరమేష్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రవర్తనా నియామావళిలోని 188వ నిబంధన ప్రకారం ప్రత్యేక హక్కుల నోటీసులు ఇచ్చారు.
Read Also: Mammootty-Mohanlal: మమ్ముట్టి – మోహన్ లాల్ వివాదం.. “శబరిమల” పూజపై రచ్చ..
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
‘‘ హోం మంత్రి సోనియా గాంధీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆమె గురించి స్పష్టంగా ప్రస్తావించి ఆమెకు ఆరోపణల్ని ఆపాదించారు. ఆమెపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. అమిత్ షా ప్రకటన పూర్తిగా అబద్ధం, పరువు నష్టం కలిగించేవి’’ అని లేఖలో పేర్కొన్నారు. మార్చి 25న రాజ్యసభలో విపత్తు నిర్వహణ బిల్లు -2024పై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ అమిత్ షా చేసిన ప్రకటనను జైరాం రమేష్ ప్రస్తావించారు.
‘‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిని కాంగ్రెస్ పాలనలో స్థాపించారు. PM-CARES నిధిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని NDA పాలనలో స్థాపించారు. సర్, కాంగ్రెస్ పాలనలో దేశాన్ని ఒకే కుటుంబం నియంత్రించేది’’ అని అమిత్ షా అన్నారు. నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకుండా, కాంగ్రెస్ నేత పీఎం రిలీఫ్ ఫండ్లో భాగంగా ఉండేవారని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో జైరాం రమేష్, అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన, సభను ధిక్కరించడం అని ఆరోపించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!