Karnataka: కరోనా కేసులు పెరిగితే వారిదే బాధ్యత.. మంత్రి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే బాధ్యత మీదే అంటూ హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే దీనికి నిరసనగా కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగితే కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్ గురువారం అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని.. ఈ నిరసనలపై కాంగ్రెస్ నేతలపై కేసులు బుక్ చేయడానికి ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో చర్చిస్తానని అన్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
నిరసనలు చేయాలంటే ఫ్రీడం పార్క్ లో చేయండి కానీ ప్రజలను కూడగట్టి రోడ్లపై ధర్నాలు చేయడం సరికాదని.. ఈ రోజు ఛలో రాజ్ భవన్ నిరసనలకు దిగుతున్నారని.. సీఎం బొమ్మైని కలిసి కోవిడ్ ప్రోటోకాల్ పై చర్చిస్తామని.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ టెక్నికల్ టీమ్ కర్ణాటకలో కోవిడ్ నివేదిక ఇచ్చింది. జూన్ మూడో వారం నుంచి అక్టోబర్ వరకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని వారు అంచనా వేశారు. ఇదిలా ఉంటే మంత్రి ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఫైర్ అయ్యారు. ముందుగా కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించిన బీజేపీ నేతలపై కేసులు పెట్టండి అని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..