INDIA Bloc: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం!
- ఇండియా కూటమిలో బీటలు
- ఆమ్ ఆద్మీ పార్టీతో తెగతెంపులు
- ఆప్తో పొత్తు ఉండబోదని కాంగ్రెస ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయి. కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దీనికి పునాది పడింది. తాజాగా కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్తో పొత్తు ఉండబోదని హస్తం పార్టీ శుక్రవారం తేల్చి చెప్పింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లలో పోటీ చేయబోతున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ప్రకటించారు. ఢిల్లీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ తాజా ప్రకటనతో దేశ రాజధాని హస్తినాలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తలపడనున్నాయి. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Nigeria: నైజీరియాలో విషాదం.. పడవ బోల్తా పడి 100 మంది మృతి
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఏడాది ప్రారంభంలోనే జరగనున్నాయి. ఇప్పటికే ఆప్ అధినేత కేజ్రీవాల్ 11 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక బీజేపీ కూడా ఎన్నికల కోసం 43 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలు, యువకులు, ఎస్సీలు, ఓబీసీలు మరియు కేంద్ర పథకాల లబ్ధిదారులతో సంప్రదింపుల కోసం ఉద్దేశించిన ప్రచారాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఆదేశాల మేరకు కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు. నామినేషన్, మీడియా సంబంధాలు, ప్రచార కథనాలను సూచించడం, సోషల్ మీడియా, డాక్యుమెంటేషన్, డేటా మేనేజ్మెంట్, ప్రత్యేక పరిచయాలు మరియు లాజిస్టిక్లు వంటి వివిధ ఎన్నికల సంబంధిత పనుల కోసం కమిటీలు ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలకు శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 2025న లేదా అంతకు ముందు జరగాల్సి ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 2020లో జరిగాయి. ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ మూడవ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం 2025 ఫిబ్రవరి 15తో ముగియనుంది.
ఇది కూడా చదవండి: Alone Honeymoon: ఒంటరిగా హనీమూన్కి వెళ్లిన పెళ్లికూతురు.. ఇదో విషాధ గాధ!
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..