Sharad Pawar: “ఆ సమయంలో మాత్రమే కాంగ్రెస్కి జాతీయ పార్టీ అని గుర్తుకు వస్తుంది”.. ఆత్మకథలో విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: ఎన్సీపీ నాయకుడు, సీనియర్ నేత శరద్ పవార్ తన ఆత్మకథలో సంచలన విషయాలను వెల్లడించారు. తన మరాఠీ ఆత్మకథ ‘లోక్ మాజే సంగతి’(ప్రజలు నాకు తోడుగా ఉన్నారు) పుస్తకంలో కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేశారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ కేంద్రబిందువు అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తుందని శరద్ పవార్ వెల్లడించారు. ఇతర పార్టీలతో వ్యవహరిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా జాతీయ పార్టీగా తన స్థాయిని గుర్తు తెచ్చుకుంటుదని ఆయన అన్నారు.
Read Also: Pushpa 2: ఇండియా సినిమాల్లో రికార్డు.. పుష్ప 2 ఆడియో రైట్స్ కు భారీ ఆఫర్
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
మహరాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ‘మహా వికాస్ అఘాడీ’ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఆయన ఆత్మకథలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీని భూములు కాపాడుకోలేని భూస్వామిగా పవార్ అభివర్ణించాడు. కాంగ్రెస్ పార్టీ గత వైభవాల గురించి ప్రగల్భాలు పలుకుతున్నారని నిందించారు. మహారాష్ట్రలొో సంక్షీర్ణం ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్ తన సహనాన్ని పరీక్షించిందని తెలిపారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన, బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ వైఖరి వల్ల సంక్షీర్ణాన్ని కొనసాగించలేనని తాను భావించాని ఆత్మకథలో పేర్కొన్నారు.
శరద్ పవర్ తన పుస్తకంలో నరేంద్ర మోదీతో తనకు ఉన్న సంబంధాలను గురించి ప్రస్తావించారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వానికి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి మధ్య తాను వారధిగా నిలిచినట్లు శరద్ పవార్ వెల్లడించారు. గుజరాత్ ప్రజలకు నష్టం జరగకూడదనే, చొరవ తీసుకుని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లడినట్లు తెలిపారు. నరేంద్రమోదీతో తన సంబంధాలు 10 ఏళ్ల క్రితం నుంచే ప్రారంభమయ్యాయి అని తెలిపారు.ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఎటువంటి పోరాటం లేకుండా రాజీనామా చేయడం వల్ల మహా వికాస్ అఘాడి అధికారానికి ముగింపు పలికిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!