IND vs PAK : టీమిండియా-పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ కు ప్లాన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి కనుమరుగైంది. తటస్థ వేదికపై టెస్ట్ సిరీస్ నిర్వహించే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ( పీసీబీ ) ప్రతిపాదనను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ( బీసీసీఐ ) కొట్టిపారేసింది. సమీప భవిష్యత్తులో కూడా భరాత్-పాకిస్తాన్ సిరీస్ జరిగే అవకాశం లేదని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. పీసీబీ అధ్యక్షుడు నజమ్ సేథి సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ ను ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ లేదా సౌతాఫ్రికాల్లో జరిపితే బాగుంటుందని ప్రతిపాదించిన అనంతరం బీసీసీఐ పై విధంగా రియాక్ట్ అయింది.
Also Read : Karnataka Politics: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్యే ఎందుకు..? డీకే ఎలా పట్టు నిలుపుకోనున్నారు..?
Also Read
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
- Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
2007 డిసెంబర్లో భారత్-పాక్ల మధ్య టెస్ట్ మ్యాచ్ చివరిసారిగా జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023 వేదిక విషయంలో ప్రస్తుతం భారత్-పాక్ల మధ్య ఏకాభిప్రాయం మాత్రం కుదరడం లేదు. భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాకిస్తాన్ లో అడుగుపెట్టదని ఇప్పటికే బీసీసీఐ తెగేసి చెప్పగా.. దీనికి కౌంటర్గా పాకిస్తాన్ కూడా వన్డే వరల్డ్కప్ కోసం భారత్లో అడుగుపెట్టదని పీసీబీ చీఫ్ నజమ్ సేథి స్పష్టం చేశాడు. ఆసియాకప్ మ్యాచ్లను భారత్ తటస్థ వేదికలపై ఆడాలనుకుంటే, వరల్డ్కప్లో తమ మ్యాచ్లను కూడా తటస్థ వేదికలపై నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్, వరల్డ్కప్ నిర్వహణపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది.
Also Read : Lubna Ameer: పోర్న్ వీడియోలు చేస్తుంది.. నటిపై ప్రియుడు సంచలన ఆరోపణలు
అయితే పాకిస్థాన్ వన్డే వరల్డ్ కప్ లో తమ జట్టు ఆడేందుకు తటస్థ వేదికలను సిద్ధం చేయాలని చెప్పడంతో ఇంటర్నెషన్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) ఆగ్రహం వ్యక్తం చేసింది. లిస్ట్ లో ఉన్న పది జట్లు తప్పకుండా తాము నిర్ణయించిన వేదికల్లోనే మ్యాచ్ లను ఆడాలని ఐసీసీ సూచించింది. టోర్నీ నుంచి తప్పుకోవాలని చూస్తే భారీ జరిమాన విధించే అవకాశం ఉన్నట్లు ఐసీసీ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. సుమారు 5 వేల కోట్ల వరకు జరిమానా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
- Tags
- bcci
- ind vs pak
- india
- Pakistan
- pcb
తాజావార్తలు
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!