Parliament Winter Session: చైనా-భారత్ ఘర్షణ.. లోక్సభలో చర్చకు కాంగ్రెస్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Party Demanding India China Border Issue Discussion In Parliament: అరుణాచల్ ప్రదేశ్లోని ‘వాస్తవాధీన రేఖ’ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై పార్లమెంట్ సమావేశాల్లో దుమారం రేగే అవకాశం ఉంది. ఈ విషయంపై లోక్సభలో చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తొలుత ఈ ఘర్షణపై చర్చను కోరుతూ.. త్రిణమూల్ కాంగ్రెస్ నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత ప్రతిపక్షాలూ చర్చకు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్లో చర్చ జరిపి.. దేశ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు మనీష్ తివారి, సయ్యద్ నాసిర్ హుస్సేన్లతో పాటు ఆప్ ఎంపీ రాఘవ చద్దా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరుతున్నారు.
AHA: ఓటీటీలో ‘వాళ్ళిద్దరి మధ్య’! వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు!!
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ఇదే సమయంలో ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. దేశ భద్రత విషయంలో రాజీ పడేదే లేదని, అందరిదీ ఒకటే మాట అని, దీన్ని రాజకీయ చేయదలచుకోలేదని పేర్కొంది. 2020 నుంచి భారత్-చైనా మధ్య జరుగుతున్న దాడులు, సరిహద్దుల వద్ద అక్కడక్కడ జరిగిన నిర్మాణాల విషయంలో మోడీ ప్రభుత్వం నిజాయితీగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే అన్నారు. అటు.. జైరామ్ రమేశ్ కూడా చైనా చర్యలపై నిద్రబోతున్న ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం తన రాజకీయ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం దేశాన్నే ప్రమాదంలో పడేసిందని ఆరోపించారు. సరిహద్దు సమస్యను తొక్కిపెట్టాలన్న మోడీ ప్రభుత్వ ధోరణితోనే చైనా మొండివైఖరి మరింతగా పెరిగిపోతోందని విమర్శించారు.
Auto Driver Case Mystery: వీడిన ఆటో డ్రైవర్ మృతి కేసు మిస్టరీ.. భార్యతో అలా ఉన్నాడని..
ఈ నేపథ్యంలోనే గల్వాన్ ఘర్షణపై మోడీ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దేశంలోకి ఎవరూ రాలేదు, ఎవరూ భారత్ భూభాగాన్ని ఆక్రమించలేదు, భారత్ సైనిక స్థావరాలేవీ ఎవరి అధీనంలో లేవు అంటూ మోడీ వ్యాఖ్యానించినవీడియోను ట్వీట్ చేస్తూ.. అందులో చైనా పేరుని ప్రస్తావించి ఉంటే, ఇప్పుడా దేశం భారత్ వైపు చూసే సాహసం చేసి ఉండేది కాదని కాంగ్రెస్ చురకలంటించింది. మరోవైపు.. లోకసభ లో వాయుదా తీర్మానం కోరుతూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం నోటీస్ ఇచ్చారు. ఘర్షణ గురించి పార్లమెంట్కు మోడీ ప్రభుత్వం తెలియజేయలేదని, ఆవిషయాన్ని దాచి ఉంచిందంటూ ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!