Auto Driver Case Mystery: వీడిన ఆటో డ్రైవర్ మృతి కేసు మిస్టరీ.. భార్యతో అలా ఉన్నాడని..
Nalgonda Auto Driver Case Mystery Solved: నల్గొండ జిల్లాలో మిస్టరీగా మారిన ఆటో డ్రైవర్ నరేశ్ మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తొలుత అతని మరణం ప్రమాదవశాత్తు జరిగిందని భావించిన పోలీసులు.. ఆ తర్వాత హత్యేనని నిర్ధారించారు. తన భార్యతో సఖ్యతగా మెలుగుతుండడం చూసి అనుమానం పెంచుకున్న స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేల్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మోతె మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన పంది నరేశ్ (28), పడిశాల శంకర్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. నరేశ్ ఆటో డ్రైవర్ కాగా.. శంకర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.
Karimnagar: ‘నేను నాగకన్యను.. నాకు గుడి కట్టండి’.. యువతి వింత ప్రవర్తన
Also Read
నరేశ్, శంకర్ మంచి స్నేహితులు కావడంతో.. ఒకరింటికి మరొకరు వచ్చి పోతుండేవారు. శంకర్ లేని సమయంలో కూడా.. నరేశ్ అతని ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. తన భార్యతోనూ నరేశ్ చాలా క్లోజ్గా ఉండటం, తాను లేని సమయంలో ఇంటికి రావడం చూసి.. శంకర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో.. అతనిపై కక్ష పెంచుకుని, హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన మిత్రుడైన మధుసూదన్ సహకారంతో.. నరేశ్ హత్యకు పథకం రూపొందించాడు. అందుకు అతనికి రూ. 30 వేలు ఇచ్చాడు. ప్లాన్ ప్రకారం.. నవంబర్ 26న మద్యం సేవిద్దామని నరేశ్కి కబురు పెట్టాడు. మధుసూదర్, నరేశ్, శంకర్ కలిసి విభళాపురం గ్రామ శివారులో ఒక స్టీల్ ప్లాంట్ వద్దకు వెళ్లారు. నరేశ్కి వాళ్లిద్దరి పూటుగా మత్యం తాగించారు. నరేశ్ మత్తులోకి జారుకున్నాక.. ఆటోలోనే ఆటోలోనే మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం ఆటోను పక్కనే ఉన్న కాల్వలోకి తోసేసి, ప్రమాదంగా చిత్రీకరించారు.
Nora Fatehi: సల్మాన్ హీరోయిన్ పై పరువు నష్టం కేస్ వేసిన ‘నోరా’
తొలుత నరేశ్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు అనుకున్నారు. అయితే.. అతని కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఈ కేసు పోలీసులకు కొంచెం సవాలుగా మారింది. ఏ కోణంలోనూ ఈ మిస్టరీ వీడలేదు. చివరికి శంకర్ మీద అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. అప్పుడతను తన నేరం అంగీకరించాడు. తన భార్యతో సఖ్యతగా ఉండటం చూసి, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే చంపానని చెప్పాడు. అతనితో పాటు కేసులో భాగస్వామ్యులైన మధుసూదన్, వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!