Auto Driver Case Mystery: వీడిన ఆటో డ్రైవర్ మృతి కేసు మిస్టరీ.. భార్యతో అలా ఉన్నాడని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Auto Driver Case Mystery Solved: నల్గొండ జిల్లాలో మిస్టరీగా మారిన ఆటో డ్రైవర్ నరేశ్ మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తొలుత అతని మరణం ప్రమాదవశాత్తు జరిగిందని భావించిన పోలీసులు.. ఆ తర్వాత హత్యేనని నిర్ధారించారు. తన భార్యతో సఖ్యతగా మెలుగుతుండడం చూసి అనుమానం పెంచుకున్న స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేల్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మోతె మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన పంది నరేశ్ (28), పడిశాల శంకర్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. నరేశ్ ఆటో డ్రైవర్ కాగా.. శంకర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.
Karimnagar: ‘నేను నాగకన్యను.. నాకు గుడి కట్టండి’.. యువతి వింత ప్రవర్తన
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
నరేశ్, శంకర్ మంచి స్నేహితులు కావడంతో.. ఒకరింటికి మరొకరు వచ్చి పోతుండేవారు. శంకర్ లేని సమయంలో కూడా.. నరేశ్ అతని ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. తన భార్యతోనూ నరేశ్ చాలా క్లోజ్గా ఉండటం, తాను లేని సమయంలో ఇంటికి రావడం చూసి.. శంకర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో.. అతనిపై కక్ష పెంచుకుని, హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన మిత్రుడైన మధుసూదన్ సహకారంతో.. నరేశ్ హత్యకు పథకం రూపొందించాడు. అందుకు అతనికి రూ. 30 వేలు ఇచ్చాడు. ప్లాన్ ప్రకారం.. నవంబర్ 26న మద్యం సేవిద్దామని నరేశ్కి కబురు పెట్టాడు. మధుసూదర్, నరేశ్, శంకర్ కలిసి విభళాపురం గ్రామ శివారులో ఒక స్టీల్ ప్లాంట్ వద్దకు వెళ్లారు. నరేశ్కి వాళ్లిద్దరి పూటుగా మత్యం తాగించారు. నరేశ్ మత్తులోకి జారుకున్నాక.. ఆటోలోనే ఆటోలోనే మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం ఆటోను పక్కనే ఉన్న కాల్వలోకి తోసేసి, ప్రమాదంగా చిత్రీకరించారు.
Nora Fatehi: సల్మాన్ హీరోయిన్ పై పరువు నష్టం కేస్ వేసిన ‘నోరా’
తొలుత నరేశ్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు అనుకున్నారు. అయితే.. అతని కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఈ కేసు పోలీసులకు కొంచెం సవాలుగా మారింది. ఏ కోణంలోనూ ఈ మిస్టరీ వీడలేదు. చివరికి శంకర్ మీద అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. అప్పుడతను తన నేరం అంగీకరించాడు. తన భార్యతో సఖ్యతగా ఉండటం చూసి, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే చంపానని చెప్పాడు. అతనితో పాటు కేసులో భాగస్వామ్యులైన మధుసూదన్, వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!