Congress: ప్రధాని మోడీ “ధ్యానం”పై కాంగ్రెస్ అభ్యంతరం.. ఈసీకి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మరో మూడు రోజుల్లో అంటే జూన్ 1న చివరిదైనా ఏడో విడత ఎన్నికలు జరగనున్నాయి. అయితే, మే 30, 31తేదీల్లో ప్రధాని నరేంద్రమోడీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ప్రధాని ధ్యానం చేయనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండీ ధ్యానం చేయనున్నారు. అనంతరం జూన్ 1న ఆయన కన్యాకుమారి నుంచి ఢిల్లీ వస్తారు. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ప్రధాని ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించి, ప్రార్థనలు చేశారు.
READ ALSO: Manjima Mohan: పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ.. చాలా బాధపడ్డాను- హీరోయిన్ ఆవేదన!!
Also Read
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ ధ్యానం- మౌన వ్రతం గురించి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈ రోజు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. 48 గంటల పాటు మౌనంగా ఉన్న సమయంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రచారం చేయడాన్ని ఎవరినీ అనుమతించకూడదని ఆయన అన్నారు. ఏ నాయకుడైనా ‘‘మౌన వ్రతం’’ పాటించినా, ఏదైనా, మౌనవ్రతంలో అది పరోక్ష ప్రచారం కాకూడదని చెప్పారు. మే 30న 7 గంటల నుంచి జూన్ 1 వరకు మౌనం పాటించడం కూడా ప్రచారమే అని, తనను తాను హెడ్లైన్స్లో ఉంచుకోవడానికి వేసిన ఎత్తుగడగా ఆయన సింఘ్వీ పేర్కొన్నారు. జూన్ 1 సాయంత్రం 24-48 గంటల తర్వాత ప్రధాని మౌన వ్రత్ ప్రారంభించాలని మేము ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు. ఒక వేళ ఆయన రేపే దీనిని ప్రారంభించాలనుకుంటే దానిని ప్రింట్ లేడా ఆడియో విజువల్ ద్వారా మీడియా ప్రసారం చేయకుండా నిషేధించాలని ఈసీని కోరారు.
మరోవైపు ప్రధాని ధ్యానంపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఫైర్ అయ్యారు. ఎవరైనా వెళ్లి ధ్యానం చేయవచ్చని, ధ్యానం చేసేవారు ఎవరైనా కెమెరా తీసుకుంటారా..? అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలకు 48 గంటల ముందు ధ్యానం పేరుతో ఆయన వెళ్లి ఏసీ గదిలో కూర్చుంటారని ఆమె ఆరోపించారు. కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేస్తున్న దృశ్యాలను టీవీలో ప్రసారం చేస్తే, అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ అన్నారు.
#WATCH | Delhi: On Congress delegation meeting the ECI, Senior advocate Abhishek Manu Singhvi says, "We told the Election Commission, that during the silence period of 48 hours, no one should be allowed to campaign, directly or indirectly. We have no objection to whatever any… pic.twitter.com/yzLsr7av89
— ANI (@ANI) May 29, 2024
తాజావార్తలు
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!