Rahul Gandhi: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు.. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో రాజస్థాన్లో జరిగిన చింతన్ శివిర్లో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు సంబంధించి, దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం ఢిల్లీలో జరిగింది. ప్రియాంక గాంధీతో పాటు పీసీసీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, పలు రాష్ట్రాల ఇన్ఛార్జ్లు సమావేశంలో పాల్గొన్నారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది. 148 రోజుల పాటు, 12 రాష్ట్రాల్లో 3600 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర సాగనుంది. భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ అధినేత పలు కమిటీలను నియమించిన సంగతి తెలిసిందే.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
Harish Rao : రైతుల వడ్లు వద్దు కానీ బీజేపీ నేతలకు ఓట్లు కావాలా
కేంద్రంలో అధికారం చేపట్టాలంటే రాష్ట్రాల్లో తిరిగి తమ ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులోభాగంగానే దేశవ్యాప్తంగా మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా అన్నిప్రాంతాలను కలుపుతూ యాత్ర సాగేలా ప్లాన్ చేస్తోంది. ప్రజలకు చేరువకావడమే లక్ష్యంగా పాదయాత్రకు పూనుకుంటోంది. ఏడాదిపాటు జరిగే ఈ మహాపాదయాత్రలో రాహుల్ గాంధీతోపాటు పార్టీ సీనియర్ నేతలు ఉండేలా సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!