మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తొండి ఆట ఆడినా ప్రతి గింజను కొన్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని, బీజేపీ నాయకులు బియ్యం తీసుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. బియ్యం కొనాలని ఢిల్లీలో ధర్నా చేశాం. నూకల నష్టాన్ని మేమె బరిస్తామన్న బియ్యాన్ని ఎందుకు తీసుకోవడం లేదు. వర్షాలతో వడ్లు మొలకెత్తుతున్నాయి. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవాలని టీఆర్ఎస్ చూస్తుంది. బియ్యం ఎందుకు కొంటలేరో బీజేపీ స్పష్టం చేయాలి. కేంద్రంలోని బీజేపీ దీ రైతు వ్యతిరేక ప్రభుత్వం. వడ్లు కొంటమని చెప్పిన బీజేపీ నేతల గొంతు ఎందుకు ముగబోయింది.
రైతుల వడ్లు వద్దు కానీ బీజేపీ నేతలకు ఓట్లు కావాలా. కష్ట కాలంలో టిఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చింది.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా. రాష్ట్రంలో రైతు బంధుకు 7500 ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. రైతుల పట్ల బీజేపీది ద్వంద వైఖరి. వడ్లు కొంటరా కొనరా అని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయాలి. తెలంగాణా రైతాంగ ఆగ్రహానికి బీజేపీ నేతలు బలవుతారు. మొలకెత్తిన వడ్లను కొనాలని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తిరగాలి. బీజేపీకి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు అంటూ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.