Congress: “కొందరు కాంగ్రెస్ నేతలు రాముడిని, హిందువులను ద్వేషిస్తారు”.. సొంత పార్టీపై సీనియర్ నేత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: సీనియర్ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం, సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు రాముడి, హిందువులను ద్వేషిస్తున్నాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడిని ద్వేషించే వ్యక్తి హిందువు కాలేడని, రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉండటం అంటే నిజం చెప్పలేనని అర్థం కాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హిందువుల మద్దతు కోరుకోకపోవచ్చని, వారు హిందూ మతగురువులను అవమానించాలని అనుకుంటున్నారని, అందుకే తనను స్టార్ క్యాంపెనర్గా గుర్తించడం లేదని ఆయన అన్నారు. ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ.. కూటమి అనేదేమీ లేదని నేను భావిస్తున్నని అన్నారు. ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం ప్రధాని మోడీని ఓడించి, బీజేపీని గద్దె దించడమేనని, అయితే విపక్షాలు మోడీని ఎంత ద్వేషిస్తున్నారో.. వారు భారతదేశాన్ని కూడా అంతే ద్వేషించడం ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ని ప్రారంభిస్తే, దాన్ని వ్యతిరేకిస్తారు, వందేభారత్ అని రైలుకు పేరు పెడితే దాన్ని వ్యతిరేకిస్తారు, ప్రతిపక్షం గందరగోళంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
- Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
మహిళలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ఇండియా కూటమి నేతలు విమర్శించడం లేదని, ప్రతీ దానికి మోడీనే నిందిస్తున్నాంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాలు తప్పులన్నింటిని మోడీపై మోపాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీలో చేరడంపై వస్తున్న ఊహాగానాలపై మాట్లాడుతూ…భారత్, సనాతనం గురించి మాట్లాడితే బీజేపీలో చేరాలనుకున్నట్లు అర్థం కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకా గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కూడా చెప్పారు. మోడీకి పోటీ ఇవ్వాలనుకుంటే ప్రియాంకాగాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని అన్నారు.
ఆచార్య ప్రమోద్ కృష్ణం వ్యాఖ్యలపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వసర్మ స్పందించారు. ‘‘ కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ కుటుంబ విధేయుడు ఆచార్య ప్రమోద్ జీ చెప్పేదాన్ని నేను ధృవీకరిస్తున్నాను. నిర్దిష్ట ఓటు బ్యాంకుకు భయపడి, శ్రీరాముడు అంటే కాంగ్రెస్ పార్టీకి అలెర్జీ’’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. కృష్ణం వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్.. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, కాంగ్రెస్ అన్ని మతాలను గౌరవిస్తుందని, దానికి రాహుల్ గాంధీనే అతిపెద్ద ఉదాహరణ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ అన్నారు.
తాజావార్తలు
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
-
Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
-
Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
-
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!