UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
- UPI, ఇతర డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలకు వీలు కల్పించే బిల్లు ఆమోదం.
- పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంలో సవరణలకు లోక్సభ ఆమోదం.
- వెంటనే ఛార్జీలు అమల్లోకి రావని స్పష్టత.
- కేంద్రం నోటిఫికేషన్ ద్వారా ఛార్జీలపై నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Charges Bill: యూపీఐ (UPI)తో పాటు ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు (PSPs) ఛార్జీలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లును లోక్సభ గురువారం ఆమోదించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007లో సవరణలు చేస్తూ ఈ బిల్లును ఆమోదించారు. ప్రస్తుతం చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం, బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు UPI సహా నిర్దిష్ట ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా ఇతర ఛార్జీలనున వసూలు చేయడానికి వీల్లేదు. కొత్త సవరణతో ప్రభుత్వం నోటిఫికేన్ ద్వారా ఏ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై ఎంత ఛార్జీలు విధించవచ్చో నిర్ణయించే అధికారం పొందుతుంది.
ప్రస్తుతం RTGS, NEFT వంటి రియల్టైమ్ బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీలు అమలులో ఉన్నాయి. ఇప్పటి వరకు UPI చెల్లింపులు పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్నాయి. ఈ బిల్లు ప్రకారం, ఇప్పటికప్పుడే UPI లావాదేవీలపై ఛార్జీలు అమలులోకి రావు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మాత్రమే ఏ లావాదేవీకి ఎంత చెల్లించాలనే వివరాలు తెలుస్తాయి.
Also Read
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
డిజిటల్ పేమెంట్స్ మౌలిక సదుపాయాలను నిర్వహించేందుకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరుల్ని సమకూర్చడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఊహాగానాల ప్రకారం, వ్యాపారులకు జరిగే అధిక విలువ గల UPI లావాదేవీలపై మాత్రమే MDR అమలు చేసే అవకాశం ఉంది. వ్యక్తుల మధ్య జరిగే (Peer-to-Peer) UPI చెల్లింపులను మినహాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!