UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
- UPI, ఇతర డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలకు వీలు కల్పించే బిల్లు ఆమోదం.
- పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంలో సవరణలకు లోక్సభ ఆమోదం.
- వెంటనే ఛార్జీలు అమల్లోకి రావని స్పష్టత.
- కేంద్రం నోటిఫికేషన్ ద్వారా ఛార్జీలపై నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Charges Bill: యూపీఐ (UPI)తో పాటు ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు (PSPs) ఛార్జీలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లును లోక్సభ గురువారం ఆమోదించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007లో సవరణలు చేస్తూ ఈ బిల్లును ఆమోదించారు. ప్రస్తుతం చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం, బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు UPI సహా నిర్దిష్ట ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా ఇతర ఛార్జీలనున వసూలు చేయడానికి వీల్లేదు. కొత్త సవరణతో ప్రభుత్వం నోటిఫికేన్ ద్వారా ఏ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై ఎంత ఛార్జీలు విధించవచ్చో నిర్ణయించే అధికారం పొందుతుంది.
ప్రస్తుతం RTGS, NEFT వంటి రియల్టైమ్ బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీలు అమలులో ఉన్నాయి. ఇప్పటి వరకు UPI చెల్లింపులు పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్నాయి. ఈ బిల్లు ప్రకారం, ఇప్పటికప్పుడే UPI లావాదేవీలపై ఛార్జీలు అమలులోకి రావు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మాత్రమే ఏ లావాదేవీకి ఎంత చెల్లించాలనే వివరాలు తెలుస్తాయి.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
డిజిటల్ పేమెంట్స్ మౌలిక సదుపాయాలను నిర్వహించేందుకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరుల్ని సమకూర్చడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఊహాగానాల ప్రకారం, వ్యాపారులకు జరిగే అధిక విలువ గల UPI లావాదేవీలపై మాత్రమే MDR అమలు చేసే అవకాశం ఉంది. వ్యక్తుల మధ్య జరిగే (Peer-to-Peer) UPI చెల్లింపులను మినహాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..