Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్
- 50 నిమిషాల పాటు ఇరువురి మధ్య సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీకి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఫోన్ చేశారు. దాదాపు ఇద్దరి మధ్య 50 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) బిల్లుపై రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చించారు. ప్రతిపాదిత డిలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఏకాభిప్రాయం సాధించే దిశగా ఈ చర్చలు జరిగినట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ అభిప్రాయాన్ని తెలుసుకునేందుకే కేంద్రం ఈ చర్చలకు ముందుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. డిలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు కేంద్ర ప్రభుత్వం ఆయనకు వివరించినట్లు వర్గాలు తెలిపాయి.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
ముందుగా ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన తర్వాతే కాంగ్రెస్ అధికారిక వైఖరిని ప్రభుత్వానికి తెలియజేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు సమాచారం. డిలిమిటేషన్ బిల్లుపై ఎలాంటి ప్రతిష్ఠంభన లేదని, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందనే విశ్వాసంతో ప్రభుత్వం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బిల్లును ప్రవేశపెట్టే ముందు ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవడమే ఈ సంప్రదింపుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలన్న తన డిమాండ్ను పునరుద్ఘాటించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రతిపక్ష ఆందోళనలతో వరుసగా వాయిదా పడుతున్నాయి. జూలై 20న జరిగిన సీజేపీ ఆధ్వర్యంలోని నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలు, రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలు వంటి అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇంతకుముందు కూడా రాహుల్ గాంధీ.. డిలిమిటేషన్ బిల్లుపై విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని కేంద్రానికి సూచించినట్లు తెలుస్తోంది. లోక్సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన సహా బిల్లు ముసాయిదాను అన్ని రాజకీయ పార్టీలకు పంపించి, బిల్లును ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్లో ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య పలు అంశాలపై తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
-
Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
-
Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
-
PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!