Karnataka: ఆడియో-వీడియోలతో మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన కాంగ్రెస్ నాయకురాలు..
- మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన కాంగ్రెస్ మహిళా నేత..
- పథకం ప్రకారం ఆడియో..వీడియో రికార్డింగ్స్..
- రూ. 20 లక్షల ఇవ్వాలని ఒత్తిడి..
Karnataka: కర్ణాటకకు చెందిన మహిళా నాయకురాలు, ఆ రాష్ట్ర మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్తో గత కొంత కాలంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న మంజులా అనే మహిళ, ఆయనకు సంబంధించిన వాట్సాప్ కాల్స్, అభ్యంతరకరమైన వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసింది. వీటిని నిలిపేయాలంటే తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేసింది.
బ్లాక్మెయిల్, దోపిడికి పాల్పడిన కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కలబురిగిలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మంజులా పాటిల్, ఆమె భర్త శివరాజ్ పాటిల్ని అరెస్ట్ చేసింది. ఈ జంట కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్ని బ్లాక్మెయిల్ చేశారు. చాలా ఏళ్లుగా సదరు మహిళ మంజుల, గుత్తేదార్తో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తన పదవిని ఉపయోగించుకున్నట్లు సమాచారం. చాలా కాలంగా వీరి మధ్య సాగుతున్న మాటల్ని, వీడియో కాల్స్ని మంజుల రికార్డ్ చేసింది. మంజులకు సంబంధించిన ఫోన్లో ఇతర వ్యక్తులకు చెందిన వివరాలు కూడా ఉన్నాయి. దీంతో దర్యాప్తు పరిధిని పెంచాలని పోలీసులు భావిస్తున్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: IND vs NZ: ఆస్ట్రేలియా పర్యటనకు ముందే జట్టులోకి యువ ఆటగాడు ఎంట్రీ..
మంజుల, శివరాజ్ తమ అరెస్ట్కి రెండు రోజుల ముందు బెంగళూర్లో డబ్బుల కోసం గుత్తేదార్ కుమారుడు రితేష్ని సంప్రదించారు. రితేష్ అధికారిక ఫిర్యాదుతో పోలీసులు శనివారం గరుడా మాల్లో దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని కోర్టులో హాజరుపరిచి, 8 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.
నలపాడ్ బ్రిగేడ్ అధ్యక్షురాలిగా ఉన్న మంజుల, గుత్తేదార్ తనకు అసభ్యకరమైన వీడియోలు పంపాడని ఆయన కొడుకు రితేష్ని కలిసింది. మీడియాకు ఈ వివరాలు వెల్లడించకుండా ఉండాలంటే రూ. 20 లక్షల్ని డిమాండ్ చేసింది. మంజుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు స్మార్ట్ఫోన్లలో జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు, పోలీసు అధికారి మరియు పీడబ్ల్యూడీ అధికారితో సహా కనీసం ఎనిమిది మంది వ్యక్తుల సెన్సిటివ్ వీడియోలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!