Karnataka: ఆడియో-వీడియోలతో మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన కాంగ్రెస్ నాయకురాలు..
- మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన కాంగ్రెస్ మహిళా నేత..
- పథకం ప్రకారం ఆడియో..వీడియో రికార్డింగ్స్..
- రూ. 20 లక్షల ఇవ్వాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకకు చెందిన మహిళా నాయకురాలు, ఆ రాష్ట్ర మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్తో గత కొంత కాలంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న మంజులా అనే మహిళ, ఆయనకు సంబంధించిన వాట్సాప్ కాల్స్, అభ్యంతరకరమైన వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసింది. వీటిని నిలిపేయాలంటే తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేసింది.
బ్లాక్మెయిల్, దోపిడికి పాల్పడిన కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కలబురిగిలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మంజులా పాటిల్, ఆమె భర్త శివరాజ్ పాటిల్ని అరెస్ట్ చేసింది. ఈ జంట కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్ని బ్లాక్మెయిల్ చేశారు. చాలా ఏళ్లుగా సదరు మహిళ మంజుల, గుత్తేదార్తో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తన పదవిని ఉపయోగించుకున్నట్లు సమాచారం. చాలా కాలంగా వీరి మధ్య సాగుతున్న మాటల్ని, వీడియో కాల్స్ని మంజుల రికార్డ్ చేసింది. మంజులకు సంబంధించిన ఫోన్లో ఇతర వ్యక్తులకు చెందిన వివరాలు కూడా ఉన్నాయి. దీంతో దర్యాప్తు పరిధిని పెంచాలని పోలీసులు భావిస్తున్నారు.
Also Read
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
Read Also: IND vs NZ: ఆస్ట్రేలియా పర్యటనకు ముందే జట్టులోకి యువ ఆటగాడు ఎంట్రీ..
మంజుల, శివరాజ్ తమ అరెస్ట్కి రెండు రోజుల ముందు బెంగళూర్లో డబ్బుల కోసం గుత్తేదార్ కుమారుడు రితేష్ని సంప్రదించారు. రితేష్ అధికారిక ఫిర్యాదుతో పోలీసులు శనివారం గరుడా మాల్లో దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని కోర్టులో హాజరుపరిచి, 8 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.
నలపాడ్ బ్రిగేడ్ అధ్యక్షురాలిగా ఉన్న మంజుల, గుత్తేదార్ తనకు అసభ్యకరమైన వీడియోలు పంపాడని ఆయన కొడుకు రితేష్ని కలిసింది. మీడియాకు ఈ వివరాలు వెల్లడించకుండా ఉండాలంటే రూ. 20 లక్షల్ని డిమాండ్ చేసింది. మంజుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు స్మార్ట్ఫోన్లలో జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు, పోలీసు అధికారి మరియు పీడబ్ల్యూడీ అధికారితో సహా కనీసం ఎనిమిది మంది వ్యక్తుల సెన్సిటివ్ వీడియోలు ఉన్నాయి.
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!