Karnataka: ఆడియో-వీడియోలతో మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన కాంగ్రెస్ నాయకురాలు..
- మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన కాంగ్రెస్ మహిళా నేత..
- పథకం ప్రకారం ఆడియో..వీడియో రికార్డింగ్స్..
- రూ. 20 లక్షల ఇవ్వాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకకు చెందిన మహిళా నాయకురాలు, ఆ రాష్ట్ర మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్తో గత కొంత కాలంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న మంజులా అనే మహిళ, ఆయనకు సంబంధించిన వాట్సాప్ కాల్స్, అభ్యంతరకరమైన వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసింది. వీటిని నిలిపేయాలంటే తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేసింది.
బ్లాక్మెయిల్, దోపిడికి పాల్పడిన కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కలబురిగిలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మంజులా పాటిల్, ఆమె భర్త శివరాజ్ పాటిల్ని అరెస్ట్ చేసింది. ఈ జంట కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్ని బ్లాక్మెయిల్ చేశారు. చాలా ఏళ్లుగా సదరు మహిళ మంజుల, గుత్తేదార్తో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తన పదవిని ఉపయోగించుకున్నట్లు సమాచారం. చాలా కాలంగా వీరి మధ్య సాగుతున్న మాటల్ని, వీడియో కాల్స్ని మంజుల రికార్డ్ చేసింది. మంజులకు సంబంధించిన ఫోన్లో ఇతర వ్యక్తులకు చెందిన వివరాలు కూడా ఉన్నాయి. దీంతో దర్యాప్తు పరిధిని పెంచాలని పోలీసులు భావిస్తున్నారు.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Also: IND vs NZ: ఆస్ట్రేలియా పర్యటనకు ముందే జట్టులోకి యువ ఆటగాడు ఎంట్రీ..
మంజుల, శివరాజ్ తమ అరెస్ట్కి రెండు రోజుల ముందు బెంగళూర్లో డబ్బుల కోసం గుత్తేదార్ కుమారుడు రితేష్ని సంప్రదించారు. రితేష్ అధికారిక ఫిర్యాదుతో పోలీసులు శనివారం గరుడా మాల్లో దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని కోర్టులో హాజరుపరిచి, 8 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.
నలపాడ్ బ్రిగేడ్ అధ్యక్షురాలిగా ఉన్న మంజుల, గుత్తేదార్ తనకు అసభ్యకరమైన వీడియోలు పంపాడని ఆయన కొడుకు రితేష్ని కలిసింది. మీడియాకు ఈ వివరాలు వెల్లడించకుండా ఉండాలంటే రూ. 20 లక్షల్ని డిమాండ్ చేసింది. మంజుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు స్మార్ట్ఫోన్లలో జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు, పోలీసు అధికారి మరియు పీడబ్ల్యూడీ అధికారితో సహా కనీసం ఎనిమిది మంది వ్యక్తుల సెన్సిటివ్ వీడియోలు ఉన్నాయి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!