IND vs NZ: ఆస్ట్రేలియా పర్యటనకు ముందే జట్టులోకి యువ ఆటగాడు ఎంట్రీ..
- చివరి టెస్టు కోసం జట్టులోకి ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా
- మంగళవారం జట్టులో చేరిన హర్షిత్
- సిరీస్ ప్రారంభంలో రిజర్వ్ ప్లేయర్గా ఉన్నప్లేయర్
- రంజీ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్లో ఆడేందుకు వెళ్లిన హర్షిత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో ముంబైలో జరగనున్న మూడో టెస్టు కోసం ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మంగళవారం (అక్టోబర్ 29) జట్టులోకి రానున్నాడు. సిరీస్ ప్రారంభంలో అతను టీమిండియాలో రిజర్వ్ ప్లేయర్గా ఉన్నాడు. ఆ తర్వాత అస్సాంతో ఢిల్లీ రంజీ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్లో ఆడేందుకు వెళ్లాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్కు హర్షిత్ ఎంపికయ్యాడు. అయితే.. ఆస్ట్రేలియాలో ఎంట్రీ ఇస్తాడనుకున్నప్పటికీ, భారత్లోనే అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
Read Also: Akshay Kumar: అయోధ్యలోని కోతుల ఆహారం కోసం బాలివుడ్ యాక్టర్ భారీ విరాళం..
Also Read
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
భారత క్రికెట్ జట్టు మాజీ సెలెక్టర్, ప్రస్తుత ఢిల్లీ కోచ్ శరణ్దీప్ సింగ్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ, “హర్షిత్ టెస్ట్ క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు ముంబై టెస్టు ఆడితే బాగుంటుంది.” అని అన్నారు. మరోవైపు.. హర్షిత్ రాణా మాట్లాడుతూ.. “ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు నేను దేశవాళీ మ్యాచ్లు ఆడాలని టీమ్ మేనేజ్మెంట్ కోరింది. ఈ మ్యాచ్లో నేను బ్యాట్, బాల్ రెండింటిలోనూ మంచి ప్రదర్శన కనబరిచినందుకు నేను సంతోషంగా ఉన్నాను” అని అస్సాంపై ఢిల్లీ విజయం తర్వాత రానా చెప్పాడు. గత నెల దులీప్ ట్రోఫీలో రానా రెడ్-బాల్ క్రికెట్లో ఆడాడు. అతను ఆడిన రెండు మ్యాచ్లలో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన టీ20కి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ.. మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అలాగే.. వైట్ బాల్ క్రికెట్కు కూడా సెలక్ట్ అయినప్పటికీ, అరంగేట్రం చేయలేకపోయాడు.
Read Also: Bangalore:12 ఏళ్లు బెంగళూరులో బంగ్లాదేశ్ వాసి.. పోలీసులకు పట్టించిన మొదటి భార్య
న్యూజిలాండ్తో మూడో టెస్టుకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!