BJP: కాంగ్రెస్ ‘‘పాకిస్తాన్ వర్కింగ్ కమిటీ’’గా మారింది.. ఎంపీ ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- కాంగ్రెస్ పార్టీ ‘‘పాకిస్తాన్ వర్కింగ్ కమిటీ’’గా మారింది..
- కాంగ్రెస్ ఎంపీ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..
- హస్తం పార్టీ పాకిస్తాన్ భాష మాట్లాడుతోందన్న సంబిత్ పాత్రా..
BJP: పహల్గామ్ దాడి తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇప్పటికే, కొందరు నేతలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు ‘‘హిందువులు’’ అని అడిగి చంపలేదు అని అన్నారు. తాజాగా, పంజాబ్ మాజీ సీఎం, ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న చరణ్జీత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శనివారం, బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ భారత సాయుధ దళాలను నిరాశ పరుస్తోందని, తమ రాజకీయ ప్రకటనల ద్వారా పాకిస్తాన్కి మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
‘‘బయటకు, ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) కావచ్చు, కానీ లోపల, ఇది పాకిస్తాన్ వర్కింగ్ కమిటీ (PWC)’’ అని దుయ్యబట్టారు. పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా 2019లో భారత సాయుధ దళం నిర్వహించిన ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’ ప్రామాణికతను కాంగ్రెస్ ఎంపీ చరణ్ జీత్ సింగ్ చన్నీ ప్రశ్నించడాన్ని సంబిత్ పాత్ర విమర్శించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ, దాని వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించింది. చన్నీ సర్జికల్ స్ట్రైక్స్ ఉనికిపై సందేహాన్ని వ్యక్తి చేశాడు. ఇది బాధ్యతారహితం మాత్రమే కాదు, ప్రమాదకరమైనవి’’ అని సంబిత్ పాత్ర అన్నారు.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
‘‘కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద దాడులను తీవ్రంగా పరిగణించకపోయినా, దేశ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, గాంధీ కుటుంబం పట్టించుకోకపోయినా, దేశ సాయుధ దళాలను పదే పదే నిరాశపరిచే లేదా ప్రజల మనోభావాలతో ఆడుకునే స్వేచ్ఛ వారికి లేదు’’ అని అన్నారు.
ఇదే కాకుండా, ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన సెనెటర్ సమాజ్వాదీ పార్టీ, ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ని ప్రశంసించడాన్ని కూడా సంబిత్ పాత్ర ప్రస్తావించారు. అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు ఉగ్రవాదాన్ని ఖండించడం కన్నా ప్రధాని మోడీని విమర్శించినందుకు పాక్ సెనెటర్ సైఫుల్లా అబ్రో ప్రశంసించారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆక్సిజన్ అందిస్తోందని అన్నారు. కాంగ్రెస్ భారతదేశంలో పాకిస్తాన్ భాషను ఎందుకు మాట్లాడుతుందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!